Unstoppable with Mahesh Babu:గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ .. పిల్లల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు..!

Unstoppable with Mahesh Babu: బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న” అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె”షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. అఖండ సినిమా ద్వారా ఘన విజయం అందుకున్న బాలకృష్ణ అవుతున్న ఈ షోకి హోస్ట్ గా మారి టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ షో 9 ఎపిసోడ్ పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలే సిద్ధమైంది. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొని బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఓటీటీ చరిత్రలోనే ఈ షో అత్యధిక వ్యూస్ తో సందడి చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సీజన్ చివరి ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు.

మహేష్ బాబు ఈ షో కి హాజరయ్యే ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఆహా మేనేజ్మెంట్ సర్ప్రైస్ ఇచ్చింది. తాజాగా ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4వ తేదీ స్ట్రీమింగ్ కానున్నట్టు ఖరారు చేసింది. ఇప్పుడు ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదల చేసి అభిమానులలో మరింత ఉత్సాహం పెంచింది. ఈ ప్రోమోలో మహేష్ బాబు బాలకృష్ణ మధ్య ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో “ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అతనే మహేష్ “అంటూ మహేష్ బాబు డైలాగ్ బాలకృష్ణ తన స్టైల్ లో చెప్తు మహేష్ బాబు కు ఆహ్వానం పలికారు.

ఈ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా ఉంది. మహేష్ బాబు ఈ షోలో గౌతమ్ క్యాట్..సితార బ్రాట్.. తాట తీస్తుంది..అంటూ తన పిల్లల మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ షో కి మహేష్ బాబుతో పాటు వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి సీక్రెట్ రివీల్ చేశారు. జాగింగ్ కోసం కె బి ఆర్ పార్క్ కి వెళ్తే అక్కడ పాము కనిపించింది. అప్పటినుండి ఆ పార్కు వెళ్లలేదని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇలా వారిద్దరి మధ్య సరదా సంభాషణలతో ఈ ఎపిసోడ్ అందరి ఫేవరెట్ ఎపిసోడ్ గా మారబోతుంది.