వేముల‌వాడకు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్రయాణం

వేముల‌వాడ‌కు వెళ్ళే భక్తులకు గుడ్‌న్యూస్. క‌రీంన‌గ‌ర్ రీజియ‌న్ ప‌రిధి నుండి వేముల‌వాడ‌కు బుధవారం వ‌ర‌కు ప్రత్యేక బ‌స్సులను నడపనున్నారు. వేముల‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల నుండి ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంటాయి. ఈ సదుపాయాన్ని భ‌క్తులు సద్వినియోగం చేసుకోవాల‌ని ఆర్టీసీ అధికారులు కోరారు. ఈ బస్సులో ఆల‌యం వ‌ర‌కు భ‌క్తులు ఉచితంగా ప్రయాణించొచ్చు. తిప్పాపూర్ బ‌స్టాండ్ నుండి వేముల‌వాడ‌కు దాదాపు 14 మినీ బ‌స్సులు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక బ‌స్సుల‌పై శివుడు, శివ‌లింగంతో కూడిన ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.