Roja: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా తిరుమల వివాదం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో పెద్ద ఎత్తున ఆవులు మరణిస్తున్నట్లు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు అయితే ఈ విషయం కాస్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం గురించి నిన్న తిరుపతిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది రోడ్లపైనే భూమన కరుణాకర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి పడుకొని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
ఇకపోతే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థాన గోశాల గురించి కూటమి ప్రభుత్వం పై రోజా నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటూ దేశ మంతట తిరుగుతున్న పవన్ కళ్యాణ్ తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదని అన్నారు. మీకు ప్యాకేజీలు, పదవులు ఇస్తే.. మిన్నకుండా ఉంటారా..అంటూ ఏకీపారేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పులు ఎవరు చేసిన వారిపై కేసులు పెట్టి శిక్షించాలని తెలిపారు. అదే విధంగా కలియుగ దైవం భక్తుల కొంగుబంగారం అయిన శ్రీవారితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబుకు బాగా తెలుసని ఈమె గుర్తు చేశారు.
అదే విధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం.. కాస్తంత రుచిచూశాడన్నారు. అందుకే తిరుమల శ్రీవారితో పెట్టుకొవద్దని మాజీ మంత్రి రోజా హితవు పలికారు. అదేవిధంగా తిరుమలలో జరుగుతున్న అపచారాలపై అలాగే గోశాల ఘటనపై విచారణ జరిపి నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి అంటూ ఈ సందర్భంగా రోజా చేసిన ఈ వ్యాఖ్యల సంచలనంగా మారాయి గతంలో తిరుపతి లడ్డులో కల్తీ జరగకపోయినా పవన్ కళ్యాణ్ కల్తీ జరిగింది అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారు అందుకే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశారు ఇలా శ్రీవారి గురించి పవన్ కళ్యాణ్ చేసిన తప్పుడు వ్యాఖ్యలు కారణంగా ఆయన కుటుంబం ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఇప్పటికే స్వామి వారు తన పవర్ ఏంటో చూపిస్తున్నారనీ రోజా చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.