AP: మాజీ ఎంపీ హర్ష కుమార్ అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే మొదటిసారి ఈయన తన అరెస్టుపై స్పందించారు. ఈ సందర్భంగా ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య విషయం గురించి ఈయన ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ పగడాల హత్య ప్రభుత్వ హత్యని ఆయనది సహజ మరణం కాదంటూ ఈయన వెల్లడించారు.
ప్రవీణ్ పగడాలది హత్యని ఎవరైతే భావిస్తారో వారందరూ కూడా ఆదివారం ఒక కొవ్వొత్తి తీసుకొని నిరసన తెలియజేస్తూ ర్యాలీగా రావాలని తెలియజేశారు. ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నందుకు వెళ్లిన హర్ష కుమార్ ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈయన తన అరెస్టు గురించి మొదటిసారి స్పందించారు.
చంద్రబాబు నాయుడు ఒక క్రిస్టియన్ పాస్టర్ ను చంపించి, కేసును తారుమారు చేయించాడని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణిస్తే ఆయన పోస్టు మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు బయటకు రాలేదని ఈయన ఆరోపణలు చేసారు.క్రిస్టియన్ పాస్టర్ చనిపోతే రాష్ట్రంలోని పాస్టర్లకు తాయిలాలు ఇచ్చి చక్కబెట్టేద్దాం అని అనుకుంటున్నాడని, చంద్రబాబుకు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంలో ఎస్పీలు, ఐజీలు సిగ్గుపడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొదట తానే వెళ్లి సంఘీభావం తెలిపానని, మంత్రి నారా లోకేష్ గుర్తు చేసుకోవాలని నేను మద్దతు తెలిపినందుకు నాకు సరైన బహుమతి ఇచ్చారు అంటూ చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పు లోకేష్ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.