AP: యూట్యూబర్స్ సీమ రజు, కిరాక్ ఆర్పీ కి భారీ షాక్…. రిటర్న్ గిఫ్ట్ తప్పదా?

AP: యూట్యూబర్ సీమరాజా, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ లకు బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా సహా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు మాజీ మంత్రి అంబంటి రాంబాబు వీరిపై కేసు నమోదు చేశారు.ఈ క్రమంలోనే గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ మీద పార్టీ, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని.. చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని తెలిపారు.

ఎన్నికలకు ముందు నుంచి కిరాక్ ఆర్పి సీమరాజు వైసిపి పార్టీ గురించి అలాగే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక రోజా ఒక మహిళ అనే విషయాన్ని కూడా మర్చిపోయి, పరిధి దాటి ఆర్పీ మాట్లాడుతున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఇలాంటి తరుణంలోనే మాజీ మంత్రి అంబంటి రాంబాబు వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.టీడీపీ నేతల ఫిర్యాదులు వస్తే వెంటనే పోలీసులు స్పందిస్తున్నప్పటికీ.. వైసీపీ నేతల ఫిర్యాదులపై మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు. చట్టాన్ని మించిన వారు ఎవరూ లేరని.. సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తే తప్పనిసరిగా చర్యలు తప్పవని అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు.

టీడీపీకి చెందిన ఐటీ విభాగం (ఐటీడీపీ) కూడా ఈ దుష్ప్రచారానికి పాల్పడుతోందని, సోషల్ మీడియాలో రాజకీయ శిష్టాచారానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి చెందినటువంటి నేతలు కార్యకర్తలు వైసిపి గురించి వైసిపి మహిళల గురించి ఇష్టానుసారంగా అభ్యంతరకరంగా మాట్లాడిన కూడా పోలీసులు వారిపై చర్యలు తీసుకోలేదు అదే వైసిపి కార్యకర్తలు గతంలో ఎప్పుడో మాట్లాడిన వ్యాఖ్యలపై కేసులు నమోదు అవుతున్న వెంటనే అరెస్టు చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు కురిపించారు.