Ambanti: ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇలా యుద్ధం పై ఎంతోమంది స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలపై పెద్ద ఎత్తున దాడికి పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ సైన్యం ఈ దాడిని తిప్పి కొడుతున్నారు. ఇలా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి మద్దతుగా పోస్టులు చేస్తూ ఇండియన్ ఆర్మీకి సలాం చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలోనే ప్రముఖ క్రికెటర్ అంబంటి రాయుడు చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..కన్నుకు కన్ను సమాధానం కాదు’ అంటూ రాయుడు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ‘కన్నుకు కన్ను తీసుకుంటే ప్రపంచమంతా గుడ్డిదవుతుంది’ అని రాయుడి చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
ఇలాంటి పోస్ట్ చేసిన మరి కాసేపటికి రాయుడు మరొక ట్వీట్ చేశారు.న్యాయం జరగాలి కానీ మానవత్వాన్ని మరచిపోకూడదు. దేశాన్ని ప్రేమిస్తున్నప్పటికీ గుండెల్లో దయ ఉండాలి అంటూ రాయుడు చేసిన ఈ పోస్ట్ సంచలనగా మారింది. ఇక ఈయన ఈ విధమైనటువంటి ట్వీట్లు చేయడంతో ఇది చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై జాలి దయ చూపించడం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఒరేయ్ అంబండి రాయుడు నువ్వు వెంటనే ఇండియా వదిలి వెళ్ళిపో అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండటానికి వీలు లేదు ఇలాంటి వ్యక్తిని పార్టీ నుంచి బయటకు పంపించండి పవన్ కళ్యాణ్ గారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే అంబటి రాయుడు మాత్రం నిత్యం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.