సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం!

సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పులు జరిగాయి. తొగుట మండలం రాంపూర్‌ గ్రామం శివారులో ఒగ్గు తిరుపతి, వంశీ మధ్య కాల్పులు జరిగినట్టు సమాచారం. చెల్లాపూర్‌కు చెందిన ఈ ఇద్దరి మధ్య గత కొంత కాలంగా భూ వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు ఇరువురు పరస్పరం కాల్పులు జరుపుకొన్నట్టు సమాచారం. ఈ కాల్పుల్లో ఓగ్గు తిరుపతి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.