బిగ్ న్యూస్ : సినిమా టికెట్స్ బుకింగ్ విషయంలో ఏపీ ప్రభుత్వమే గెలిచిందా.?

Telugu Cinema Tickets : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు అయినటివంటి వాటిలో దర్శకుడు వేణు శ్రీరామ్ తో చేసిన హిట్ సినిమా “వకీల్ సాబ్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా తోనే ఒక్కసారిగా ఏపీ మరియు తెలుగు సినిమాకి పెద్ద యుద్ధమే స్టార్ట్ అయ్యింది.

అక్కడ నుంచి బెనిఫిట్ షో లకి గాని టికెట్ ధరల అంశంలో గాని ఇలా అనేక అంశాల్లో తెలుగు సినిమాకి గట్టి దెబ్బ తినక తప్పలేదు. ఇక అవి చాలవు అన్నట్టు కొత్త జీవో లు టికెట్ ధరల తగ్గింపులు మరిన్ని సమస్యలు తెచ్చి పెట్టాయి. వీటితో పాటుగా ఏపీ ప్రభుత్వమే టికెట్లను తమ ఆన్లైన్ పోర్టల్ లో సినిమా టికెట్లు అమ్ముతామని తెచ్చిన ప్రతిపాదన అయితే మరింత కలకలం రేపింది.

ఎవరో తీసిన సినిమాల మీద ప్రభుత్వం పెత్తనం ఏమిటి అని అనేక కామెంట్స్ వచ్చాయి. అయితే ఇపుడు ఈ అంశంలో ఫైనల్ గా అయితే ఏపీ ప్రభుత్వమే గెలిచినట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్ ద్వారా టికెట్స్ ను అమ్మవచ్చని అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ చేసాయి.

ఇందుకు గాను ఏపీ ఎస్ ఎఫ్ డి సి అనే పోర్టల్ ద్వారా అమ్మాలని సూచించారట. దీనితో ఫైనల్ గా అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వమే విన్ అయ్యినట్టు అయ్యింది. అయితే దీనిపై ఇంకా సమాచారం వచ్చి క్లారిటీ మరికొన్ని రోజుల్లో రానుంది.