Anushka Shetty : ఫైనల్ గా అనుష్క ఇంట్రెస్టింగ్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ మీకోసం.!

Anushka Shetty : సౌత్ ఇండియన్ సినిమా దగ్గర హీరోయిన్స్ లో భారీ క్రేజ్ ఉన్నటువంటి అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కూడా ఒకరు. బాహుబలి సిరీస్ తో ఆకట్టుకున్నాక ‘నిశ్శబ్దం’ సినిమాలో మాత్రమే కనిపించి తర్వాత సైలెంట్ అయ్యిపోయింది.
అయితే తర్వాత ఎన్నో భారీ ఆఫర్స్ వచ్చినా అనుష్క ఎందుకో వదిలేసుకుంది. లాస్ట్ కి మళ్ళీ తనకి  ఇచ్చిన యూవీ క్రియేషన్స్ వారితోనే ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ ప్రేమకథకు ఓకే చెప్పింది.
జాతి రత్నాలు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో ఒక వినూత్న ప్రేమ కథకు ఆమె ఓకే చెప్పగా ఇపుడు ఈ సినిమాపై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.
చిత్ర బృందం ఈ సినిమాపై ఆల్రెడీ ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చెయ్యగా రెండో షెడ్యూల్ కి గాను రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి లేటెస్ట్ గా ఈ షూట్ ని హైదరాబాద్ లోనే స్టార్ట్ చేశారట.
ఇందులో అనుష్క కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి పి మహేష్ దర్శకత్వం వహిస్తుండగా అలాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.
ఫైనల్ గా అయితే అనుష్క సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.