ఒకే సారి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ప్రముఖ సింగర్ చిన్మయి…!

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో పాటలు పాడిన చిన్మయి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు పొందింది. ఏ మాయ చేసావే సినిమాలో సమంతకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి ఆ సినిమా ద్వారా బాగా పాపులర్ అయింది. ఇలా సింగర్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో చిన్మయి మీటూ ఉద్యమం ద్వారా పలువురు సినీ ప్రముఖుల మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కూడా ఇటువంటి విషయాల గురించి తరచూ స్పందిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా చిన్మయి ప్రస్తుతం తల్లిగా ప్రమోషన్ పొందింది. అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన రాహుల్ రవీంద్రన్ ని ప్రేమించి 2014 లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరు ఒకరినొకరు ప్రేమించుకునే వివాహ బంధంతో ఒకటయ్యారు. అప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.చిన్మయి తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలో రాహుల్ రవీంద్రన్ చిన్నారుల చేతి ఫోటోలను తీసి..వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” ద్రిప్త మరియు శర్వస్ మా జీవితంలోకి వచ్చి జీవితాంతం మాతో ఉండిపోయే అతిథులు” అంటూ తెలిపారు. రాహుల్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆ దంపతులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సందర్భంగా వారికి సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక రాహుల్ రవీంద్రన్ విషయానికి వస్తే కొన్ని సినిమాలలో హీరోగా నటించిన ఈయన చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రధాన పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా రాహుల్ ప్రధాన పాత్రలో నటించాడు.