Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మరణం… జగన్, పవన్ పై ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు!

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం గురించి పోలీసులు అసలు విషయం వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించారని పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ఈయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్నటువంటి రహదారులలోని అన్ని సిసి కెమెరాలను పోలీసులు పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించారని వెల్లడించారు.

ప్రవీణ్ ద్విచక్ర వాహనంలో వస్తూ రెండు చోట్ల కింద పడిపోయారు. ఇక మూడోసారి ఈయన కింద పడటం వల్లే మరణించారని పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే ఆయన మద్యం కూడా సేవించి ఉన్నారని రిపోర్టులు కూడా వచ్చాయి. అయితే తాజాగా ప్రవీణ్ మరణం పై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా హర్ష కుమార్ మాట్లాడుతూ..ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించలేదని పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉందని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మరణం ముమ్మాటికీ హత్యేనని.. న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తానని హర్షకుమార్ వెల్లడించారు. ఇందుకోసం 2025 శనివారం 19వ తేదీన గుడ్ ఫ్రైడే రోజున సాయంత్రం 4 గంటల నుండి 6.30 గంటల వరకు ఎవరికి వారు వచ్చి ప్రవీణ్ దేహం ఎక్కడ దొరికిందో కొవ్వూరు దివాన్ చెరువు రోడ్ లో నయార పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న స్థలంలో ఎవరికి వారు ఒక కొవ్వొత్తు తెచ్చుకొని అక్కడ వెలిగించాలని పిలుపునిచ్చారు.

ప్రవీణ్ ను ప్రభుత్వమే హత్య చేయించిందని నమ్మే ప్రతి ఒక్కరు రావలన్నారు హర్షకుమార్. అలాగే ఈస్టర్ ఆదివారం ఆంధ్రా, తెలంగాణలో ఉన్న ప్రతి సమాదుల దొడ్డి దగ్గర ప్రవీణ్ ఫ్లెక్సీ పెట్టి కొవ్వొత్తులు వెలిగించాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు అంటూ హర్షకుమార్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.