దారుణం : పెళ్ళై రెండు నెలలు కూడా గడవకముందే..

ఆ జంటకు పెళ్లి అయ్యి రెండు నెలలు కావస్తోంది. కొత్తగా పెళ్లి అవ్వడంతో ఆ జంట ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఆ జంట పై ఎవరి కళ్ళు పడ్డాయేమో కానీ ఆ నవ వధువు వరుడు జీవితంలో విషాదం నింపింది. వధువు వరుడుకి దూరం అయ్యి అనంతలోకాలకు తిరిగి వెళ్ళిపోయింది. ఏడు అడుగులు వేసి జీవితాంతం కలిసి నడవాలి అనుకున్న ఆ భర్తకు, పెళ్లయి 2 నెలలు కూడా కాకముందే భార్యను కాటికి సాగనంపాల్సిన పరిస్థితి రావడంతో అతను రోదించిన తీరు వర్ణనాతీతం. అసలు విషయంలోకి వెళితే..

దారుణమైన ఘటన తమిళనాడులోని తిరువన్నమలై లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరువన్నమలై జిల్లా సీమంగుడి ప్రాంతానికి చెందిన మణికందన్ అనే యువకుడికి చెన్నైకి చెందిన గీతా ప్రియా అనే యువతితో వివాహం జరిగింది. ఈ జంటకు రెండు నెలల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం ఆ దంపతులు ఇద్దరూ చెన్నైలో నివాసం ఉంటున్నారు. పల్లవన్ గ్రామ బ్యాంకులో మణికందన్, గీతా ప్రియ ఉద్యోగం చేస్తున్నారు. క్రిస్మస్,న్యూఇయర్ సందర్భంగా సెలవులు రావడంతో భార్యాభర్తలిద్దరూ కాంచీపురం వెళ్ళాలి అనుకున్నారు. ఈ క్రమంలోనే కారులో చెన్నైకి బయల్దేరి వెళ్లారు.

ఇక దారి మధ్యలో రంగసామి లేక్ దగ్గర కారు పార్క్ చేసి మెడిసిన్ కొనేందుకు భార్యాభర్తలు రోడ్డు పక్కన నడుచుకుంటూ మెడిసిన్ కోసం వెళుతున్నారు. ఇంతలో అటుగా ఒక కారు వేగంగా వెనకనుంచి వచ్చి ఆటోను ఢీకొట్టింది. అదే వేగంతో వచ్చి గారు గీత ప్రియా మీదుగా దూసుకుపోయింది. పక్కనే నడుస్తున్న భార్యపై కారు వెళ్లడంతో ఆ భర్తకి ఏమీ అర్థం కాక ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. కారు కింద చిక్కుకున్న గీతను భర్త స్థానికుల సహాయంతో బయటకు తీశాడు. ఇక వెంటనే 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కాంచీపురం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో గీత ప్రియా చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయింది. విగతజీవిగా పడి ఉన్న తన భార్యను చూస్తూ ఆ భర్త రోదించిన తీరు హాస్పటల్ లో ఉన్న వారందరికీ కలిచివేసింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటివరకు కళ్ళు ఎదురుగానే ఉన్న భార్య ఒక్కసారిగా అనంతలోకాలకు వెళ్లిపోవడంతో భర్త గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇక ఘటనకు సంబంధించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.