నాలుగే‌ళ్లు‌గా డ్రైవ‌ర్‌తో అక్ర‌మ‌ సంబంధం..క్లైమాక్స్‌లో త‌ల ప‌గ‌ల‌గొట్టాడు!

వివాహేత‌ర సంబంధాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి. త‌న మ‌న అనే బేధం లేకుండా స‌భ్య స‌మాజం సిగ్గుప‌డే ప్ర‌వ‌ర్త‌న లోకంలో కోకల్ల‌లుగా  తెర‌పైకి వ‌స్తున్నాయి. ప‌ది నిమిషాల ప‌డ‌క సుఖం  మ‌నిషిని మృగంలా మారుస్తోంది. మ‌నిషి అవ‌స‌రం కావొచ్చు…ప‌రిస్థితులు దిగ‌జార్చ‌డం కావొచ్చు..కార‌ణం ఏదైనా నిండైన జీవితాలు మ‌ధ్య‌లోనే ముగిసిపోతున్నాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి హైద‌రాబాద్ ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఫిర్యాదుకు  రావ‌డంతో  వెలుగులోకి వ‌చ్చింది. భ‌ర్త చ‌నిపోయిన వివాహిత బిడ్డ‌తో బ‌‌తుకు బండి  సాగిస్తోంది. ఒంట‌రిగా భ‌ర్త లేకుండా  సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ డీసీఎం డ్రైవ‌ర్ వ‌చ్చి చేరాడు. చివ‌రిగా డ్రైవ‌రే కాల య‌ముడయ్యాడు. మోజు తీరిన త‌ర్వాత మ‌త్తుల్లో బీరు సీసాతో  త‌ల‌పై కొట్టి చంపాడు.

నాచారంలోని బాబా న‌గ‌ర్ కు చెందిన రేణుక‌(30) కూర‌గాయ‌లు వ్యాపారం చేస్తుంటుంది. భువ‌న గిరి జిల్లా యాదాద్రికి చెందిన డీసీఎం డ్రైవ‌ర్  అంజ‌య్య అమెతో నాలుగేళ్ల క్రిత‌మే  ప‌రిచయం పెంచుకున్నాడు. అత‌నికి అప్ప‌టికే పెళ్లై భార్య‌, పిల్ల‌లు గ‌ల‌రు. చిలుకాన‌గ‌ర్ లో కాపురం ఉంటున్నాడు. అయితే  రేణుక భ‌ర్త ఏడాది క్రితం చ‌నిపోయాడు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇరువురు శారీర‌కంగా ఒక‌ట‌య్యారు. ఇలా ఏడాదిగా ఇద్ద‌రి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింది. అయితే ఆదివారం అంజ‌య్య ఫ్యామిలీ ఊరెళ్లడంతో రేణుక‌ని ఏకంగా ఇంటికే ర‌ప్పించాడు. ఇద్ద‌రు మ‌ద్యం సేవించారు.

అటుపై శృంగారంలో పాల్గొన్నారు. అనంత‌రం రేణుక అంజ‌య్య కు దిమ్మ తిరిగిపోయే ప్రపోజ‌ల్ పెట్టింది. అంజ‌య్య‌ను అవ‌స‌రాల నిమిత్తం చిన్న‌గా డ‌బ్బులు అడిగింది రేణుక‌. అంజ‌య్య ప‌రిస్థితిని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసాడు. అలా  ఇద్ద‌రి మ‌ధ్య మాట మాటా పెరిగింది. దీంతో అంజ‌య్య ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. మ‌ద్యం మ‌త్తులో ఖాళీ చేసిన బీరు బాటిల్ తో త‌ల‌పై కొట్టాడు. దీంతో రేణుక తీవ్ర ర‌క్త స్రావంతో  అక్క‌డిక్క‌డే ప్రాణాలు వ‌దిలింది. విష‌యం ఉప్ప‌ల్ పోలీసుల‌కు తెలియ‌డంతో మ్యాట‌ర్ బ‌య‌ట‌కొచ్చింది.