ఘోర రైలు ప్రమాదం… 61 మంది మృతి

కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 61 మంది మృతిచెందగా 52 మందికి గాయాలయ్యాయి. బయోఫ్వే వద్ద రైలు పట్టాలు తప్పడంతో 7 బోగీలు లోయలో పడిపోయాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రావిన్షియల్ గవర్నర్ ఫిఫీ మసుకాను స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు అందుబాటులో లేక ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించేందుకు గూడ్స్ రైళ్లను ఉపయోగిస్తున్నారు.