Ismart Jodi: ఇస్మార్ట్‌ జోడీ షో ద్వార ఓంకార్ కు వచ్చిన లాభం ఎంతో తెలుసా ..?

Ismart Jodi: ఓంకార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించిన ఓంకార్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు పొందాడు. ఓంకార్ యాంకర్ గా మాత్రమే కాకుండా నటుడిగా కూడ మంచి గుర్తింపు పొందాడు. ఈయన పలు టీవీ షోలకు ప్రొడ్యూసర్ గా కూడ వ్యవహరించాడు. అంతే కాకుండా రాజుగారి గది సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇటీవల ఓంకార్ ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా,ప్రొడ్యూసర్ గా కూడ వ్యవహరించాడు.

ఇష్మార్ట్ జోడి సీజన్1 మంచి ప్రేక్షకాదరణ పొందడంతో
ఇష్మార్ట్ జోడి సీజన్ 2 ని ప్రారంభించాడు. ఇటీవల ఈ సీజన్ కుడా ముగిసింది. ఈ సీజన్ 2 లో వినయ్‌ మరియు హర్షిత విజేతలుగా నిలవగా.. అమ్మ రాజశేఖర్ మాస్టర్, రాధమ్మ జోడి రన్నర్ గా నిలిచారు. అయితే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అయిన వినయ్, హర్షిత జంటకు 25 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. ఇక రన్నర్ గా నిలిచిన అమ్మ రాజశేఖర్ మాస్టర్,రాధమ్మ జంటకు 10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది. ఇక ఈ ఇస్మార్ట్ జోడీలో పార్టిసిపేట్ చేసిన జంటలకు
ఒకొక్కరికి 5 లక్షల రూపాయలు అందచేశారు.

అయితే ఇప్పుడు ఈ షో ద్వారా ఓంకార్ కి ఎంత లాభం వచ్చిందన్న విషయం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ స్మార్ట్ జోడి సీజన్ టూ కోసం ఓంకార్ దాదాపుగా కోటి లక్షల రూపాయలు ఖర్చు చేయగా.. స్టార్ మా ఛానల్ నుండి దానికి రెట్టింపుగా రెండు కోట్ల రూపాయలు ఓంకార్ అందుకు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రకారం ఈ షో ద్వారా ఓంకార్ దాదాపు కోటి రూపాయలు లాభం పొందాడని వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెర మీద ఓంకార్ ఏ షో చేసిన కూడ కచ్చితంగా లాభం వస్తుందని అంటున్నారు.