మీ ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, బైక్‌ ఉన్నాయా ..అయితే రేషన్ కార్డు కట్ !

All cardholders will get ration

మీ ఇంట్లో టీవీ, ఫ‌్రిజ్‌లున్నాయా..? తిరగడానికి బైక్‌ ఉందా..? అయితే మీ రేషన్‌ కార్డ్‌ కట్.‌ ఈ వివరాలన్నీ చెప్పి రేషన్‌ కార్డులు రద్దు చేసుకోకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వం వార్నింగ్‌ ఇచ్చింది. దర్జాగా కార్లలో తిరుగుతూ కొంత మంది రేషన్ కార్డు మీద బియ్యం, గోధుమలు తీసుకుంటారు. అలాంటి వారికి కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. కారు కూడా కాదు, బైక్‌తోనే మొదలుపెట్టింది. టీవీ, ఫ్రిజ్, బైక్ లాంటి వాటిని కలిగి ఉన్నవారు వెంటనే రేషన్ కార్డును సరెండర్ చేయాలని హెచ్చరించింది.

మార్చి 31 వరకు అందుకు గడువు విధించింది. లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని.. జైలు శిక్ష కూడా ఎదుర్కోక తప్పదని స్పష్టం చేసింది. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పలు రేషన్‌ దుకాణాల ఎదుట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ చర్య సరికాదంటూ నినాదాలు చేశారు.

టీవీ, ఫ్రిజ్‌ లాంటివి ఇప్పుడు నిత్యావసరం అయ్యాయి. వడ్డీ రహిత రుణాల లాంటి ఆఫర్లు వచ్చినప్పుడు సాధారణంగానే ప్రజలు ఇలాంటివన్నీ కొనుక్కుంటారు. అంతమాత్రానికే వారికి రేషన్‌ తొలగించడం సరికాదు. ఈ ప్రభుత్వం పేదలను వ్యతిరేకంగా పని చేస్తోంది అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఖాదర్‌ దుయ్యబట్టారు. మొత్తంమీద ఈ అంశం కర్ణాటకలో దుమారం రేపుతోంది. మరి బీజేపీ ప్రభుత్వం దీనిపై ముందుకువెళ్తుందా, వెనకడుగు వేస్తుందా వేచి చూడాల్సిందే.