Nayanatara: నయనతారని వదిలేసి వెళ్లిన విఘ్నేష్.. మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్?

Nayanatara: కోలీవుడ్ జంట లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రియుడు విగ్నేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జంట గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న విషయం మందరికి తెలిసిందే. నయనతార,విఘ్నేశ్‌లు ఇటీవలె నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ జంట ఒకవైపు సినిమాలకు సంబంధించిన విషయాలలో బిజీ బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు వీళ్లిద్దరూ కలసి సోషల్ మీడియాలో తమ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

ఇకపోతే విగ్నేష్, నయనతార ప్రస్తుతం విరహ వేదన లో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జంట వారి వారి పనుల్లో బిజీ బిజీగా వేరే వేరే చోట ఉన్నారు. ఇద్దరు వేరు వేరు చోట వారి పనుల్లో బిజీగా ఉండటంతో ప్రియుడు విగ్నేష్ తన ప్రియురాలు నయనతార ని మిస్ అవుతున్నాడట. అయితే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతాం అని ప్రకటించిన ఈ జంట, పెళ్లికి ముందే వారిద్దరూ కలసి నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ కలసి రౌడీ పిక్చర్స్‌ అనే బ్యానర్‌‌ను ప్రారంభించి అందులో మంచి మంచి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే విఘ్నేష్ ఎక్కడికి వెళ్లినా నయనతార పక్కనే ఉంటుంది అన్న విషయం అందరికి తెలిసిందే.

 

ఈసారి మాత్రం ప్రియురాలిని వెంటతీసుకెళ్లకుండా వెళ్లాడు. దీంతో నయనతార ను మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు.ఈ సందర్భంగా ప్రియురాలు నయనతార ఫోటో షేర్ చేస్తూ ఈసారి నీతో ట్రావెలింగ్ ని మిస్ అవుతున్నాను.. ఒక పని పెండింగ్ లో ఉండడంతో నేను ఒక్కడినే వెళ్లాల్సి వచ్చింది. ఈ పని త్వరగా ముగించుకొని వచ్చేస్తాను.. లాంగ్ హాలిడే కి వెళ్దాం అంటూ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అరే.. ప్రియురాలిని లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడే.. అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.