కార్తీ ఖైదీ సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ లోకేష్!

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లను కురిపిస్తూ రికార్డులు బద్దలు కొడుతుంది. ఇకపోతే ఈ సినిమా విజయవంతం కావడంతో ఖైదీ సినిమా సీక్వెల్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 2019లో కోలీవుడ్ హీరో కార్తీ హీరోగా తెరకెక్కిన చిత్రం ఖైదీ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా కూడా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలలో ఖైదీ సీక్వెల్ గురించి ప్రస్తావించడంతో ఖైదీ సినిమా సీక్వెల్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఖైదీ సినిమా సీక్వెల్ ఉంటుందని కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే లోకేష్ సైతం ఈ సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం ఈయన ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈ సినిమాలో హీరో కార్తితో పాటు సూర్య కూడా నటిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో కార్తీ హీరోగా నటించగా సూర్య విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు. ఈ విధంగా ఈ సినిమా సీక్వెల్ చిత్రం గురించి డైరెక్టర్ ప్రకటించడంతో పెద్దఎత్తున ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా ఒకే సినిమాలో కోలీవుడ్ బ్రదర్స్ కార్తీక్ సూర్య ఇద్దరు నటిస్తున్నారని తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి.