సుశాంత్ సింగ్ కేసు : పీక పిసికి చంపలేదు .. విషం ఎక్కించి .. వామ్మో !?

subramanian swamy sensational comments on sushant singh rajput case

బాలీవుడ్ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య దేశ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. సుషాంత్ మ‌ర‌ణంపై ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్ప‌గించ‌డంతో కేసు మ‌రింత జ‌ఠిల‌మైంది. ప్ర‌స్తుతం సీబీఐ వేగంగా ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అధికారులు సుషాంత్ నివాసంలో మ‌రిన్ని వివ‌రాలు సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా సుషాంత్ మ‌ర‌ణంపై బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేసారు. సుషాంత్ పై విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని.. ఆ వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాకుండా కొంద‌రు కుట్ర ప‌న్నార‌ని ఆరోపించారు.

cbi officers inquire the neighbors of sushanth singh rajput house
cbi officers inquire the neighbors of sushanth singh rajput house

అందువ‌ల్లే పోస్ట్ మార్టం ఆల‌స్యం చేసిన‌ట్లు అనుమానం వ్య‌క్తం చేసారు. బాధ్యులైన వారంద‌ర్నీ క‌ఠినంగా శిక్షించాల‌ని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ట్వీట్ చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఈ ట్వీట్ పై  సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారు?  కేసు న‌మోదు చేసిన అధికారులు ఎలా బ‌ధులిస్తారు? అన్న‌ది చూడాలి. ఇక సుషాంత్ మ‌ర‌ణం వెనుక   ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగింది. ఈ నేప‌థ్యంలో కొన్ని పెద్ద త‌ల‌కాయ‌ల్ని పోలీసులు విచారించారు . బాలీవుడ్ నుంచి దాదాపు 40 మందిని విచారించారు. వాళ్ల నుంచి కొంత స‌మాచారం రాబట్టారు.

నెపోటిజం కార‌ణంగా సుషాంత్ ఆత్మ హ‌త్య చేసుకున్నాడు ? అన్న కోణంలోనే ఈ విచార‌ణంతా సాగింది. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కి ఓ `రా` అధికారి సుషాంత్ ది ఆత్మ‌హ‌త్య కాదు..హ‌త్య అని గ‌ట్టిగా అనుమానం వ్య‌క్తం చేసారు. దీని వెనుక ముంబై  మాఫియా వ్య‌క్తులు ఉన్నార‌ని అనుమానిస్తూ ఓ ట్వీట్ చేసారు. అయితే ఈ ట్వీట్ ని అప్ప‌ట్లో ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. మ‌రి తాజాగా బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి తాజా ఆరోప‌ణ‌కి…ఈ `రా`  అధికారి అనుమానానికి ఏదైనా సంబంధం ఉందేమో! అన్న కొత్త కోణం తెర‌పైకి వ‌స్తుంది.