Hero Danush: రెస్టారెంట్ లో అమ్మాయి తో కలిసి భోజనం చేసిన ధనుష్… ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు?

Hero Danush: ధనుష్, ఐశ్వర్య ధనుష్ వీడిపోతున్నామని సోషల్ మీడియా వేదిక గా ప్రకటించిన తర్వాత వారి గురించిన ఏ వార్తయినా వైరల్ అవుతోంది. ధనుష్ తన రీసెంట్ సినిమా అత్తరంగిరీ సినిమాతో మరో సారి నటనతో ప్రేక్షకులని మెప్పించారు. అయితే ఇపుడు ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ప్రస్తుతం. ఒక రెస్టారెంట్ లో భోజనం చేస్తుండగా తీసిన ఫోటో ఇపుడు వైరల్ అవుతోంది. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి రెస్టారెంట్ లో తిన్నాడు ఇందులో వింతేముంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే .

వెంకీ అట్లూరి తో త్రి బాషా చిత్రం వాతి /సార్ లో నటిస్తున్న ధనుష్ హైదరాబాద్ లో షూటింగ్ కోసం వచ్చి ఒక మిలిటరీ హోటల్ లో భోజనం చేసాడు. అందులో పక్కన పింక్ కలర్ హుడీ వేసుకున్న ఒక అమ్మాయి ఉండడంతో ఇపుడది చర్చకు దారి తీసింది.
ఆ అమ్మాయి మలయాళం హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ అని ఫస్ట్ అనుకున్నా మళ్ళీ కాదని ఫిక్స్ అయ్యారు. చిత్ర బృందంలో వ్యక్తి అయ్యుంటుందని కొందరు నెటిజెన్స్ కామెంట్ చేసారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ధనుష్ చాలా గ్యాప్ తర్వాత తన సోదరుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో నాన్ ఓరువన్ సినిమా చేస్తున్నారు. ఇక మాళవిక అయ్యర్ తో కలిసి నటించిన మారన్ విడుదలకు సిద్ధంగా ఉంది.అలాగే హాలీవుడ్ ఫిల్మ్ ‘ది గ్రే మాన్ ‘, అలాగే తిరుచిరాంబలమ్ సినిమా రెడీ గా ఉన్నాయి ఇందులో ధనుష్ కి జోడి గా నిత్యమీనన్, రాశి ఖన్నా, ప్రియా భవాని శంకర్ నటించారు.