Pawan Kalyan: సంచలన నిర్ణయం తీసుకున్న పవన్.. ఇకపై జీతం మొత్తం వారికేనా..దేవుడు సామి నువ్వు!

Pawan Kalyan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అనే సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలపై పూర్తి సయిలో దృష్టి సారించారు అలాగే ప్రజా సంక్షేమమే బాధ్యతగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేసే దానధర్మాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆయన సినిమాలలో కొనసాగుతున్న సమయంలోనే సినిమాలలో సంపాదించినది చాలావరకు సహాయం చేయడానికి ఉపయోగించేవారు రాజకీయాల పరంగా అధికారంలో లేని సమయంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఈయన దానధర్మాలు చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆపదలో ఉన్నవారు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తే తప్పకుండా వారికి సహాయం చేస్తూ నేనున్నాననే భరోసా కల్పిస్తారు.

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు తాజాగా పిఠాపురం నుంచి కొంతమంది అనాధ పిల్లలు క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఇలా వారి బాధలు విన్న పవన్ కళ్యాణ్ చలించి పోవడమే కాకుండా వారికి అభయం ఇచ్చారు తాను పదవిలో కొనసాగుతున్నన్ని రోజులు నాకు వచ్చే జీతం మొత్తం మీ చదువులు ఆరోగ్యం మీ భవిష్యత్తు కోసమే ఉపయోగిస్తానని మాట ఇచ్చారు.

సాధారణంగా ఇలాంటి సహాయాలు చేయాలి అంటే ఒక నెల జీతం లేదా ఒక ఏడాది జీతం ఇస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా పదవిలో కొనసాగుతున్నన్ని రోజులు జీతం ఒక్క రూపాయి తీసుకోకుండా అనాధ పిల్లలకే ఇస్తానని ప్రకటించడంతో అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈయన ఇలా అభయం ఇవ్వటంతో పిఠాపురం నియోజకవర్గం ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. ఈ విషయం తెలిసి ఇంకెన్ని దానాలు చేస్తావు స్వామీ, నీకేమి దాచుకోవా అంటూ పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, నెటిజన్లు అభినందిస్తున్నారు.