ఏపీలో కొత్తగా 28 కేసులు నమోదు

ఏపీలో కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 9,394 కరోనా పరీక్షలు నిర్వహించగా, 28 పాజిటివ్ కేసులు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 14 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 4 కేసులు గుర్తించారు. శుక్రవారం 77 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,560 పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనాతో 14,730 మంది మరణించారు.