Extra Martial Affair : తల్లి వివాహేతర సంబంధం.. బలైపోయిన 20 ఏళ్ల కూతురు.. ఊరంతా?

Extra Martial Affair – ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు అనవసరంగా తమ పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. లేని పోని ఆకర్షణలకు గురై జీవితాల్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కట్టుకున్న భర్తతో చక్కగా కాపురం చేయాల్సిన భార్య ప్రియుడి మోజులో పడి, అలాగే కట్టుకున్న భార్యను వద్దనుకొని ప్రియురాలు మోజులో పడి భర్త ఇలా ఇరువురూ తప్పులు చేస్తూ వారి సంసారాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. కొందరు వివాహేతర సంబంధాలు తప్పు అని తెలిసినా కూడా వాటి వైపు మొగ్గు చూపుతున్నారు.తాజాగా ఇలాంటి వాటిని ఒకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన భార్యాభర్తలు, వారి కూతురు మెహసనలో ఉండేవారు.ఆ కూతురి వయసు 20 సంవత్సరాలు.ఆ యువతి తండ్రికి పరేష్ జోషి అనే స్నేహితుడు ఉన్నాడు.పరేష్ అనే వ్యక్తి తన స్నేహితుడు ఇంటికి తరుచుగా వస్తుండేవాడు.ఈ క్రమంలో పరేష్,యువతి తల్లి కామినికి పరిచయం ఏర్పడింది. భర్తకు తెలియకుండా కామిని,పరేష్ జోషి ఫోన్‌లో మాట్లాడుకునేవారు.భర్త ఇంట్లో లేనప్పుడు పరేష్ ఏకంగా ఆ మహిళ ఇంటికి వెళ్లేవాడు. కామిని కూడా పెళ్లీడుకొచ్చిన కూతురు ఇంట్లో ఉందన్న స్పృహ కూడా లేకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని అతనితో రాసలీలలు సాగించేది. తన తల్లిని ఆ వ్యక్తి కలవడం ఆ యువతికి నచ్చేది కాదు. పలు సందర్భాల్లో తల్లితో, ఆమె ప్రియుడితో గొడవ పెట్టుకుంది.

ఈ పరిణామం ఆమె తల్లికి, ప్రియుడికి ఇబ్బందిగా అనిపించింది. ఆ యువతి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన పరేష్ జోషి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 28న ఆ యువతిని పని ఉందని, కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు.ఖారీ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. రాత్రి 8.30 సమయంలో ఈ ఘటన జరిగింది.ఈ విషయం తెలియని యువతి తండ్రి తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు ఆ యువతి ఫొటోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని కోరారు. మరోపక్క నాలుగు బృందాలుగా ఏర్పడి ఆమె కోసం వెతుకులాట సాగించారు. నవంబర్ 30న బైపాస్ రోడ్ పక్కన బ్రిడ్జి కింద ఓ యువతి సగం కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. ఆ యువతి పెట్టుకున్న బ్రాసిలెట్, రిస్ట్ వాచ్, చేతి వేలికి పెట్టుకున్న రింగ్ చూసిన ఆమె తండ్రి ఆ మృతదేహం తన కూతురిదేనని గుర్తుపట్టాడు. పోలీసులు ఎవరిపై అయినా అనుమానం ఉందా అని ప్రశ్నించగా తన స్నేహితులడు పరేష్‌పై అనుమానం ఉందని చెప్పాడు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.