వైయస్ జగన్ ప్రభుత్వం చెప్పినట్టుగానే అమరావతి భూ కుంభకోణంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మరియు మరో 11 మందిపై అవినీతి నిరోధక బ్యూరో కేసు నమోదు చేసిన కేసుపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అమరావతి భూముల కొనుగోలుపై ఎసిబి దర్యాప్తును నిలిపివేసిన రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఎసిబి దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) లోని విషయాలను మీడియా ప్రచురించడాన్ని నిషేధించిన రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వును కూడా ప్రభుత్వం ప్రశ్నించింది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పిటిషన్ను సుప్రీమ్ కోర్టు ఒకటి లేదా రెండు రోజుల్లో తీసుకుంటుంది. సిట్టింగ్ సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి కుమార్తెలను కలిగి ఉన్నందున ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని ఏ బెంచ్ తీసుకుంటుందో అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
ఎఫ్ఐఆర్ ని ప్రచారం చేయవద్దని మీడియాను కోరిన హైకోర్టు ఉత్తర్వు మీడియాలో మరియు ఇతర మేధావి వర్గం లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి.
మీడియా సంస్థలు దీనిని పత్రికా స్వేచ్ఛను హరించడం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని అభివర్ణించాయి. గాగ్ ఆర్డర్కు వ్యతిరేకంగా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ కూడా నిరసన తెలిపింది.
