ప‌వన్ క‌ళ్యాణ్‌- క్రిష్ సినిమాపై అదిరిపోయే అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

దాదాపు రెండేళ్ళ త‌ర్వాత సినిమాల‌లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిందీలో సూప‌ర్ స‌క్సెస్ సాధించిన పింక్ రీమేక్ చిత్రాన్ని తెలుగులో వ‌కీల్ సాబ్ పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు టాక్. ఇక ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం, మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీతో బిజీగా ఉన్నాడు ప‌వ‌న్.

గ‌త కొద్ది రోజులుగా ప‌వ‌న్ -క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాపై అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. హీరోయిన్స్ గురించి, ప‌వ‌న్ పాత్ర గురించి లేదంటే ఆయ‌న లుక్ గురించి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం క్రిష్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న హిస్టారికల్ మూవీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోర మీసాల‌తో బందిపోటుగా క‌నిపించి అల‌రించ‌నున్నార‌ట‌. ప‌వ‌న్ కెరీర్‌లో తొలిసారి ఓ చారిత్రాత్మ‌క చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఏడాది పాటు కూర్చుని క్రిష్ ఓ క‌థ‌ను సిద్ధం చేయగా, అది ప‌వ‌న్ కు న‌చ్చ‌డంతో వెంటనే ఓకే చెప్పేశారు.ప‌వ‌న్ 27వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం చార్మినార్, తాజ్ మ‌హ‌ల్ సెట్స్ నిర్మిస్తున్న‌ట్టు టాక్. వాటి కోసమే దాదాపు 25 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నార‌ని, ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే పేరు ఫిక్స్ చేయ‌నున్న‌ట్టు టాక్.