గుజరాత్ సీఎం ‘విజయ్ రూపానీ’ కి కరోనా పాజిటివ్ !

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసెర్చ్ సెంటర్‌ (యూఎన్ఎంఐసీఆర్సీ)లో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన యూఎన్ఎంఐసీఆర్సీ.. సీఎం రూపానికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు.

Image result for gujarat cm

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్కే పటేల్ తెలిపారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో కోవిడ్-19 సోకినట్టు తేలిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆదివారం వడోదరలో నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ రూపానీ మాట్లాడుతూ కూలబడిపోయారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పట్టుకున్నారు.

వేదికపైనే సీఎం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయి.. తక్షణమే సీఎంను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తొలుత సీఎంను పరీక్షించిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి సమస్యా లేదని తెలిపారు. 24 గంటల అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. అయితే, సోమవారం అన్ని రకాలు పరీక్షలు నిర్వహించగా.. సీఎం కోవిడ్ బారినపడ్డట్టు నిర్ధారణ అయ్యింది. గుజరాత్‌లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.