Manchu Lakshmi: కరోనా బారిన పడ్డ మంచు లక్ష్మి.. టైమ్ పాస్ కోసం సలహాలు ఇవ్వండి!

Manchu Lakshmi: కరోనా మహమ్మారి తోక ముడిచినట్టే ముడిచి మరోసారి తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కేవలం వందల్లో వేలల్లో ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా లక్షకు చేరుకున్నాయి.రోజుకు వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఒక్కసారిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కరోనా బారిన పడినట్లుగా వెల్లడించారు.

అదేవిధంగా గత నాలుగు రోజుల క్రితం మంచు మనోజ్ ఈ మహమ్మారి బారిన పడినట్టు తెలుపగా తాజాగా తన అక్క మంచులక్ష్మి సైతం కరోనా బారిన పడ్డారు. ఇదే విషయాన్ని మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ రెండు సంవత్సరాల నుంచి బూచోడు వంటి కరోనా మహమ్మారి నుంచి తప్పించుకు తిరుగుతున్నాను. కానీ ఎట్టకేలకు దానికి దొరికాను అంటూ తన కరోనా బారిన పడిన విషయాన్ని తెలిపారు.

ప్రస్తుతం కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను..ప్రతి ఒక్కరూ ఇంటిలోనే సేఫ్ గా ఉండండి మాస్క్ తప్పనిసరిగా ధరించండి రెండు వ్యాక్సిన్ ఇంజక్షన్ తీసుకున్నా బూస్టర్ డోస్ తీసుకోండి అంటూ అందరికీ సలహాలు ఇచ్చింది. ఈక్రమంలోనే టైం పాస్ అవడం కోసం తనకు టాప్ త్రీ సినిమాలు, షో, పాడ్‌కాస్ట్‌లు ఉంటే చెప్పండంటూ అభిమానులను కోరింది. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.