వివాదాల ‘రిపబ్లిక్’ పరిస్థితి ఏమవుతుందబ్బా.!

రిలీజ్‌కి ముందు వివాదాలు.. అనుకోకుండా ఆయా సినిమాలపై అంచనాలు పెంచేస్తుంటాయి. గతంలో చాలా సార్లు ఈ పరిణామాలు చూస్తూనే వచ్చాం. అయితే, ఈ సారి వివాదం కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఏంటా సినిమా.? ఏంటా వివాదం.? అంటారా.? అదేనండీ, మెగా ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రిపబ్లిక్’ సినిమా. సహజంగా సినిమాల్లోని పలానా సీన్లు వివాదాస్పదంగా ఉన్నాయి.. పలానా పోస్టర్లు వివాదాస్పదమవుతున్నాయి.. పలానా వారి మనోభావాలు దెబ్బ తింటున్నాయి.. ఇలాంటివే వివాదాలంటే.. కానీ, ‘రిపబ్లిక్’ సినిమాకి సంబంధించిన వివాదాలు ప్రత్యేకం. రీసెంట్‌గా జరిగిన బైక్ యాక్సిడెంట్ కారణంగా సాయి ధరమ్ తేజ్ ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నాడు.

కానీ, ఆయన మేనమామలతో పాటు మొత్తం మెగా ఫ్యామిలీయే దిగి వచ్చి సాయి తేజ్ సినిమాని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌‌కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే ఎన్ని రకాలుగా వివాదాలకు కారణమవుతున్నాయో అందరికీ తెలిసిందే. సరే, పవన్ మాటల్లోని వివాదాల సంగతి పక్కన పెడితే, ఆ వివాదాలు సినిమా పబ్లిసిటీకి చాలా చాలా ఉపయోగపడ్డాయని చెప్పక తప్పదు. సినిమాకి ఊహించని హైప్ పెరిగిపోయింది. ఎలాగైనా ఈ సినిమాని హిట్ చేయాలన్న కసితో మెగా అభిమానులు ఊగిపోతున్నారంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి, కొద్ది రోజుల్లోనే రిలీజ్‌కి రెడీగా ఉన్న ‘రిపబ్లిక్’ హిట్ కొడుతుందా.? వేచి చూడాలిక.