తెలంగాణ‌లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దారుణ‌హ‌త్య‌

తెలంగాణ రాష్ర్టంలో జ‌డ్జెర్ల కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాంచంద్రారెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కిడ్నాప్ చేసి మ‌రీ దారుణానికి ఒడిగట్టారు. రాంచంద్రారెడ్డి ప్ర‌యాణిస్తోన్న వాహ‌నంలో కిడ్నాప్ చేసి హ‌త‌మ‌ర్యారు. అదీ ఆయ‌న ర‌క్త‌సంబంధీకులే ఈ దారుణానికి పాల్ప‌డ‌టం విస్మ‌యానికి గురి చేస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే షాద్ న‌గ‌ర మండ‌లం అన్నారానికి చెందిన రాంచంద్రారెడ్డి కొన్నేళ్ల‌గా హైద‌రాబాద్ లో ఉంటున్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ పార్టీ ప్ర‌ముఖునిగా కొన‌సాగుతున్నారు. రాంచంద్రారెడ్డికి అన్నారంలో భూములున్నాయి. ఆ స్థ‌లం విలువ ఆరు కోట్లకు పైగానే ఉంటుందిట‌. ఈ భూ వ్య‌వ‌హారాలు అన్నింటిని ప్ర‌తాప్ రెడ్డి అనే వ్య‌క్తి చూస్తున్నాడు.

అయితే శుక్ర‌వారం ఆ భూమి ప‌నులు చూసుకుని డ్రైవ‌ర్ పాషా తో క‌లిసి రాంచంద్రారెడ్డి వ‌స్తుండ‌గా ప్ర‌తాప్ రెడ్డి తో పాటు మ‌రో యువ‌కుడు రాంచంద్రారెడ్డిని అడ్డుకున్నారు. డ్రైవ‌ర్ ని క‌త్తి చూపించి చంపేస్తాన‌ని బెదిరించ‌డంతో పాషా పారిపోయి పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. ఆ స‌మ‌యంలో రాంచ‌ద్రారెడ్డిని అదే వాహ‌నంలో కొత్తూరు మండ‌లం పెంజ‌ర్ల కు తీసుకెళ్లి హ‌త‌మ‌ర్చారు. అప్పటికే స‌మాచారం అందుకున్న పోలీస‌లు వెంట‌ప‌డిన‌ప్ప‌టికీ జ‌ర‌గాల్సిన అన‌ర్ధం జ‌రిగిపోయింది. మెడ‌, పొట్ట భాగంలో క‌త్తిపోట్ల‌ను బ‌ట్టి  పోలీసులు హ‌త్య‌కేసు గా న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈభూమిని ప్ర‌తాప్ రెడ్డి ద్వారా ఓ స్థానిక నేత కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. అత‌నికి అందించ‌డంలో రాంచంద్రారెడ్డి జాప్యం చేయ‌డంతో పాటు…ప్ర‌తాప్ రెడ్డి ఒత్తిడికి లొంగ‌క‌పోయ‌వ‌డం తో వివాదం తారా స్థాయికి చేరుకోవ‌డంతో రాంచంద్రారెడ్డి హ‌త్య‌కు కు గురైన‌ట్లు తెలుస్తోంది. శుక్ర‌వారం సాయంత్ర 4.30 గంట‌ల ప్రాంతంలో కిడ్నాప్ జ‌రిగింది. 5 గంట‌ల‌కి పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. 7.30 కి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు.