ప్యారిస్ కు బయల్దేరనున్న సీఎం జగన్.. ఎందుకంటే?

YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రస్తుతం పలు కార్యక్రమాలతో బాగా బిజీగా ఉంటున్నారు. ఒకవైపు రాజకీయంగా చేపట్టే పథకాలు చేపడుతూనే.. మరోవైపు తమ రాష్ట్రానికి కావాల్సిన సదుపాయాలను అందిస్తున్నారు. మొన్నటివరకు పర్యటనలో బిజీగా ఉన్న జగన్.. త్వరలో ప్యారిస్ కు వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. జగన్ పెద్ద కూతురు హర్ష.. ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేసుకోవడంతో.. ఆ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొనడానికి ఈనెల 28 రాత్రి న బయలుదేరనున్నాడు. ఇక 29న ప్యారిస్ కు చేరుకొని వేడుక అనంతరం జులై 2న మళ్లీ తన స్వస్థలానికి చేరుకోనున్నారు. ఈ విషయం గురించి తాజాగా సీఎంవో తెలియజేసింది.