ప్రస్తుత ఏపీ పరిస్థితులన్నింటిపై విపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి, విద్యుత్ బిల్లుల పెంపు, విశాఖ గ్యాస్ దుర్ఘటన, మత్తు మందు డాక్టర్ సుధాకర్, ప్రభుత్వం భూముల్ని అమ్మడం..పేదలకు భూములివ్వడం ఇలా ఏపీలో ఉన్న అన్ని సమస్యలపై బాబు అండ్ కో ఏ స్థాయిలో ధ్వజమెత్తుతున్నారో విధితమే. అయితే వీటన్నింటికంటే ముఖ్యమైన రాయలసీమను సస్యశ్యామలం చేసే పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంపై మాత్రం ఈ గ్యాంగ్ లో ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. దీంతో చంద్రబాబు ఏపీలో ఎలా రాజకీయాలు చేస్తారో మరోసారి ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతోంది.
కేవలం అధికార పక్షాన్ని ఆడిపోసుకోవడమే పచ్చ తమ్ముళ్లు పనిగా పెట్టుకున్నారని క్లియర్ గా ఓ క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఏపీ టెక్నాలజీ మాజీ చైర్మెన్ కొయ్య ప్రసాద్ రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కరోనా వైరస్ కంటే ప్రమాదమన్నారు. కరోనా కి ఏడాదికి కాకపోతే రెండేళ్లకో..మూడేళ్లకో..నాలుగేళ్లకో వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఉంది. కచ్చితంగా మన డాక్టర్లు, శాస్ర్తజ్ఞులు వ్యాక్సిన్ కనిపెడతారని చెప్పొచ్చన్నారు. కానీ చంద్రబాబు అనే కరోనాకి వ్యాక్సిన్ లేదు రాదు. లేదు. ఆయనకు సోకిన వైరస్ కరోనా కంటే ప్రమాదకరం. మనిషిని నిలువెల్లా తినేసే వైరస్ తో బాధపడుతున్నారు. .
చంద్రబాబుతో పాటు, ఆయన ఎమ్మెల్యేలు, మిగతా వాళ్లకు ఆయనలాగే వైరస్ సోకుతుందేమోనని సందేహం తో కూడిన కామెంట్ చేసారు. పోతిరెడ్డిపై మాట్లాడని చంద్రబాబు మత్తు డాక్టర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇకనైనా ఇలాంటి కుళ్లు రాజకీయాలు మానుకుని ప్రజలకు మంచి జరిగే పనుల గురించి ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ గురువారం ఇంట్లోనే నిరసన దీక్షలు చేపట్టాలని చంద్రబాబు పచ్చ తమ్ముళ్లకు పిలిపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రేపటి దీక్ష కోసం సిద్ధమవుతున్నారు.
