సీఐడీ నోటీసులపై హైకోర్టు తలుపు తట్టనున్న చంద్రబాబు

Chandrababu shocked with Kuppam voters

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష టీడీపీకి మరో షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో చంద్రబాబు సహా పలువురు నేతలు అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. ఈ కేసు విచారణకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చారు

chandrababu-bluff-statements-about-ap-municipal-elections

సీఐడీ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న న్యాయనిపుణులతో సమావేశమైన చంద్రబాబు.. వారి వద్ద నుంచి సలహాలు తీసుకున్నారు. చంద్రబాబు రేపు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసుకు సంబంధించిన.. ఎఫ్ ‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరనున్నట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో పెద్ద ఎత్తున్న భూకుంభకోణానికి తెర తీశారని తెలుగుదేశం అధినేత,నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ నుంచి రెండు బృందాలుగా హైదరాబాద్ వచ్చిన సీఐడీ అధికారులు జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు రాజధానిలో అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో విచారణకు సంబంధించి నోటీసులు అందజేశారు.

చంద్రబాబుతో పాటు మరో కీలక నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా 41 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.మార్చి 23న తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందించాలని ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబునాయుడికి నోటీసులు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి భూములకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారి పేరుతో కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను 2019 డిసెంబర్‌లో సిద్ధం చేసింది. ఆ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ప్రకారం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిలో ముఖ్యమైన వారి పేర్లతో ఆరుగురి పేర్లను కేబినెట్ సబ్ కమిటీ పొందుపరించింది.