చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర ద్రోహి..విశాఖ ఎలా వ‌స్తాడ‌నుకున్నారు?

అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్పాటు కాగానే ఉక్కున‌గ‌రం విశాఖప‌ట్నంని రాజ‌ధానిగా చేయాల‌ని అప్ప‌ట్లో స‌ర్వే చేసిన చాలా క‌మిటీలు సూచించాయి. విశాఖ, విజ‌య‌వాడ‌,  తిరుప‌తి స్మార్ట్ సిటీ హోదాలో ఉన్న‌ పెద్ద న‌గ‌రాల‌ను క‌మిటీ  ప్ర‌భుత్వం ముందు ఉంచింది. అన్నింటికంటే ప్ర‌ధానంగా విశాఖ రాజ‌ధాని అయితే బాగుంటుంద‌ని రాష్ర్ట ప్ర‌జ‌లు భావించారు. ఉత్త‌రాంధ్ర వాసులు ఇంకాస్త ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు. స‌హ‌జంగా రాజ‌ధాని అంశం త‌లెత్తిన‌ప్పుడుఏ ప్రాంతం వాసులైనా త‌మ ప్రాంతాన్నే రాజధాని చేయాల‌ని కోరుకోవ‌డం స‌హ‌జం. అలాంటి వాద‌న‌లు అప్ప‌ట్లో ఎక్క‌డిక‌క్క‌డ‌ బ‌లంగానే వినిపించాయి.

కానీ రాష్ర్టం ప‌రిస్థితులు వేరు. ఆ ప‌రిస్థితుల్లో విశాఖ ఒక్క‌టే రాజ‌ధానిగా ప్ర‌క‌టించి…అభివృద్ది చేస్తే బెంగుళురు, హైద‌రాబాద్, ముంబై సిటీల్లా  వేగంగా అభివృద్ది చెందుతుంద‌ని క‌మిటీలు సూచించాయి. అలాగే  ఉపాధి కోసం వెళ్లే వ‌ల‌స‌లు త‌గ్గుతాయని భావించారు. ముఖ్యంగా రాష్ర్టం నుంచి వ‌ల‌స‌లు ఎక్కువ‌గా  వెళ్లేది ఉత్త‌రాంధ్ర‌(విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం) వాసులు కాబ‌ట్టి విశాఖ‌ని రాజ‌ధాని చేస్తే రాష్ర్ట అర్ధిక ప‌రిస్థితితో పాటు, వెనుకబ‌డిన జిల్లాలు వృద్దిలోకి వ‌స్తాయ‌ని స‌ర్వేలు చెప్పాయి.  కానీ చంద్ర‌బాబు  నాయుడు మాత్రం అప్ప‌టికే గుంటూరు-విజ‌య‌వాడ సిటీల‌పై మాటేసి వేల ఎక‌రాలు అక్ర‌మంగా రైతుల నుంచి దోచుకున్నాడు.

తన బినామీలు, త‌న‌ సామాజిక వ‌ర్గం చేతే వంద‌ల ఎక‌రాలు కొనిపించి త‌మ వాళ్ల‌నే వృద్దిలోకి తీసుకురావాల‌ని వేసిన ఎత్తుగ‌డ‌కు జ‌గ‌న్ ఎలా బ్రేకులు వేసారో తెలిసిందే. రాష్ర్టంలో మూడు రాజ‌ధానులు చేస్తూ..అందులో విశాఖ‌ని ప‌రిపాల‌నా రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌డంతో ప‌చ్చ త‌మ్ముళ్ల‌కు ఊపిరి ఆడ‌నంత ప‌నైంది. అటుపై రాష్ర్టంలో చోటుచేసుకున్న ప‌రిస్థితులు…అమ‌రావ‌తిలో పెయిడ్ ఆర్టిస్టుల పెర్పామెన్స్ ని  జ‌గ‌న్ లైట్ తీసుకుని ముందుకు వెళ్లిపోయారు. కేవ‌లం ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు శాంతి ప‌రులు కాబ‌ట్టే! విశాఖ‌ని స్కిప్ చేసి  విజ‌య‌వాడ‌ను రాజ‌ధాని చేసినా జ‌నాలు ప‌ట్టించుకోలేదు.

ఇక విశాఖ‌పై చంద్ర‌బాబు కప‌ట ప్రేమ గురించి తెలియంది ఎవ‌రికి. ఇటీవ‌లే ఆయ‌న క‌ప‌ట ప్రేమ మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. విశాఖ గ్యాస్ బాధితుల్ని పరామ‌ర్శిస్తాన‌ని అనుమ‌తులు తీసుకుని…త‌న మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని సైలెంట్ గా తిరిగి హైద‌రాబాద్ వెళ్లిపోయాడు. దీంతో విశాఖ వాసులు మ‌రోసారి  చంద్ర‌బాబు పై భ‌గ్గుమ‌న్నారు. తాజాగా వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమ‌రనాథ్ చంద్ర‌బాబు తీరుపై నిప్పులు చెరిగారు. విశాఖ బాధితుల్ని  ప‌రామ‌ర్శిస్తాన‌న్న బాబు ఎటెళ్లిపోయాడు?  బాధితుల ప‌ట్ల‌ చంద్ర‌బాబుకున్న చిత్తశుద్ది ఇదేనా? అని ప్ర‌శ్నించారు. ఎవ‌రైనా ప్ర్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే బాధితుల్ని ప‌రామ‌ర్శిస్తారు.

కానీ చంద్ర‌బాబు వెంట‌నే ఆ ప‌ని చేయ‌క‌పోగా…కొన్ని రోజులు గ‌డిచిన‌ త‌ర్వాత  విశాఖ బాధితుల‌ పేరు చెప్పుకుని త‌న ప‌నులు ఎలా చూసుకున్నాడో? చూసారా?అంటూ బాబు గుట్టు బ‌హిర్గతం చేసారు. అదే విశాఖ బాధితుల‌పైనా…ఇక్క‌డ ప్ర‌జ‌ల‌పైనా ఆయ‌న‌కున్న ప్రేమ అంటూ ఆక్షేపించారు. విశాఖ ప‌ట్ణణం అన్నా..ఈ ప్రాంత‌పు ప్ర‌జ‌లు అన్నా చంద్ర‌బాబుకి చిన్న చూప‌న్నారు. ఇక్క‌డ ప్ర‌జ‌ల్ని కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మాత్ర‌మే వాడుకోవ‌డ‌మే చంద్ర‌బాబుకు తెలుసున‌న్నారు. చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్రా ద్రోహి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.