Chandrababu: అత్యాచారానికి గురైన యువతిని పరామర్శించిన చంద్రబాబు..

Chandrababu: ఇటీవలే ఓ యువతి అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం అందరి దృష్టి తాకింది. ఇక ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వుండటంతో ఆ యువతిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి చేరుకున్నాడు.

ఇక అక్కడే ఉన్న పోలీసులు ఆయనను ఆ యువతి దగ్గరికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇక అక్కడ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆ బాధిత యువతిని పరామర్శించడానికి వెళ్తుండగా.. అక్కడున్న టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు హాస్పిటల్ నుంచి వెళ్లిపోవాలంటూ అడ్డుకున్నారు. ఇక చివరికి ఆమెను పోలీసులు ఆ బాధిత యువతి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడున్న టిడిపి మహిళా నేతలు నిరసన తెలుపుతున్నారు.