తిరుపతి బై పోల్ … పనబాక పోటీలో ఉన్నారా? లేరా? ఆ రోజే క్లారిటీ

Chandrababu, Lokesh unhappy with EC

పంచాయతీ.. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమితో టీడీపీ బోర్లా పడింది. అధిష్టానం మాట వినే నేతలు, కేడర్ కనుమరుగవుతారు. పార్టీని కాపాడేదెవరు అంటూ ఆపసోపాలు పడుతున్న వేళ.. టీడీపీకి మరో సవాల్ ఎదురవుతోంది. అదే తిరుపతి లోక్ సభ బై పోల్. ఈ ఉప ఎన్నిక టీడీపీకి డూ ఆర్ డై లాంటింది. ఓడితే ఇక టీడీపీ కనుమరుగైనట్టే అనే ప్రచారం పెరుగుతుంది. దానికి తోడు సీనియర్ లీడర్లను పక్కన పెట్టాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

chandrababu-bluff-statements-about-ap-municipal-elections

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలనే నినాదా ఊపందుకుంది. అదే జరిగితే లోకేష్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చంద్రబాబు భయపడుతున్నట్టు తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే ఈ ఒక్క సీటుపై తెలుగుదేశం పార్టీ పుల్‌ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా తెగించి పోరాడాలని నేతలకు చంద్రబాబు ఇప్పటికే పూర్తిగా క్లాస్ పీకిటనట్టు తెలుస్తోంది. ఈ నెల 24న నామినేషన్ వేసేందుకు టీడీపీ సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ అభ్యర్థిని ముందుగానే టీడీపీ ప్రకటించినా.. ఇప్పటి వరకు పనబాక లక్ష్మి తెరపైకి రాలేదు. అసలు ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నారో లేరో తెలియక కేడర్ తికమక అవుతోంది.

వైసీపీ నేతలు మాత్రం పదే పదే ప్రచారం చేస్తున్నారు. పనబాక పోటీ నుంచి తప్పుకున్నారాని.. టీడీపీకి అసలు అభ్యర్థే దొరకడం లేదని, అందుకే ఆమెను బతిమాలుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ విమర్శలు నిజమా కాదా అన్నది ఈ నెల 24న తేలిపోనుంది. ఆ రోజు పనబాకతో నామినేషన్ వేయించేందుకు టీడీపీ అధిష్టానం ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. తాజాగా తిరుపతి గెలుపు కోసం ఏం చేయాలి అనే దానిపై పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయిన చంద్రబాబు.. సీనియర్ నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గల నేతలతో విడి విడిగా భేటీ అయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం పై చర్చించారు.

వైసీపీ వైఫల్యాలపై కొన్ని ముఖ్య అంశాలను గుర్తించి వాటినే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోంది. ప్రతి నియోజకవర్గాన్ని పది క్లస్టర్లు గా విభజించి, మొత్తం ఏడు నియోజకవర్గ వర్గాలకు 70 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీటికి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఇన్ చార్జ్ లుగా బాధ్యతలు ఇచ్చారు. వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు గెలిచినా రాష్ట్ర సమస్యలు, ప్రయోజనాల కోసం పోరాటం చేయడం లేదన్నది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్‌ అయ్యారు. టీడీపీని గెలిపిస్తే, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, విభజన హామీల కోసం పోరాటం చేస్తామని.. టీడీపీ నేతలు హామీ ఇస్తామంటున్నారు. అలాగే ఈ నెల 24 న పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేసే ముందు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలను డూ ఆర్ డైగా భావించిన బరిలో దిగుతోంది టీడీపీ…