ఏపీకి ఆ ‘న్యాయం’ చేయలేకపోతున్న కేంద్రం.. ఆ కధ మళ్లీ మొదటికే.. ??

 

దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన దిశ అత్యాచార ఘటనతో చట్టంలో మరింతగా మార్పులు చేయవలసిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే.. కాగా ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రల్లో ఒక ప్రకంపనాన్నే సృష్టించింది.. ఇలాంటి దారుణాలు మరోసారి జరగకుండా ఉండడానికి ప్రత్యేక చట్టాన్ని తేవాలని ఎందరో డిమాండ్ కూడా చేశారు.. ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ దిశ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుని దిశ బిల్లు-2019ని ప్రవేశ పెట్టింది.. ఈ బిల్లు అమలైతే అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి. దీనికి పక్కాగా ఆధారాలు ఉంటే..

ఇక ఇలాంటి కేసులో న్యాయం జరగాలంటే ప్రస్తుతం ఈ కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా.. దిశ చట్టం ప్రకారం మూడు వారాల్లోనే తీర్పు వెలువడుతుంది. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకో కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. కాగా నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా బిల్లు రూపొందించింది ఏపీ ప్రభుత్వం.. ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి.. చట్ట రూపం ఇచ్చేందుకు కేంద్రానికి పంపించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. కానీ వైఎస్ జగన్ చేస్తున్న ఈ న్యాయపరమైన చట్టానికి ఇంకా రూపు రాలేదు.. అంటే కేంద్రం నుండి అనుమతి రాలేదు..

ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కు పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని.. ఐపీసీ, సీఆర్‌పీసీలో మార్పులు చేయకుండా అమలు చేసే పరిస్ధితి లేదు కాబట్టి వాటిని సరిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది.. ఇకపోతే దిశ బిల్లులో ఏపీ రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా ఐపీసీలో కొత్తగా 354ఈ, 354ఎఫ్‌, 354జీ సెక్షన్లను చేర్చారు. ఇలా కేవలం ఏపీ వరకే వర్తించేలా నిందితుల కఠిన శిక్షల కోసం ఐపీసీలో సెక్షన్లు మారిస్తే మిగతా రాష్ట్రాలు కూడా మార్పులు కోరవచ్చు. అప్పుడు మొత్తం ఐపీసీ అమలే ప్రశ్నార్ధకంగా మారుతుందట.. అంతిమంగా ఐపీసీనే ప్రక్షాళన చేయాల్సి వస్తుందట. అందుకే ఈ బిల్లును తిరస్కరించారనే చర్చ జరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వం ఇలా దిశ బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపడం జగన్ సర్కార్‌కు కాస్త ఇబ్బందిగా మారింది. అదీగాక మళ్లీ ఈ బిల్లులో తగిన సవరణలు చేసి తిరిగి అసెంబ్లీలో ఆమోదిస్తే కానీ కేంద్రానికి పంపే అవకాశం ఉండదు. అప్పుడు కేంద్రం ఓకే అంటేనే చట్టం అవుతుంది.. లేకపోతే మళ్లీ కథ మొదటికి వచ్చినట్లే. మరి ఇన్నాళ్లుగా ఈ విషయంలో జరుగుతున్న వార్తలు గాలి వార్తలే వుతాయా.. లేక వైఎస్ జగన్ అనుకున్నది సాధిస్తాడా ? వేచి