Bundi Sanjay: మంత్రి పువ్వాడపై హత్య కేసు నమోదు చేయాల్సిందే అంటున్న బండి సంజయ్..

Bundi Sanjay: నిరుపేద సామాన్య కార్యకర్త సాయి గణేష్ అనే యువకుడు మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతో ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఘటన పట్ల సీరియస్ గా స్పందించాడు. ఈ ఘటనలో భాగస్వాములైన మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకుల పై హత్య కేసు నమోదు చేయాలి అని తెలిపాడు.

మరణ వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికి కేసు నమోదు చేయకపోవడంతో ఇది సిగ్గుచేటు అని.. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల వల్లే కేసు నమోదు చేయడం లేదని అన్నాడు. ఇక వీటికి బాధ్యులైన వారిని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నాడు. ఇక మరణించిన సాయి గణేష్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.