Sister In Law: వావివరుసలు మరచి వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిది.. చివరికి అలా.?

Sister In Law: రోజు రోజుకి సమాజంలో వివాహేతర సంబంధాల వల్ల జరిగే అనర్ధాలు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు తప్పు అని తెలిసి కూడా చాలా మంది ఎక్కువగా వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్న కూడా అలాంటి పనులు చేసే వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికే ఈ వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి. కొంతమంది అయితే వావివరుసలు మరచి మరి వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే..

సేలంజిల్లా ఏర్కాడ్ తమిళనాడు ఒక అద్భుతమైన చూడచక్కని పర్యాటక ప్రాంతం. ఇక్కడికి నిత్యం ఎంతో మంది పర్యాటకులు వస్తూ వెళ్తూ ఉంటారు. అంతే కాకుండా అక్కడ బస చేయడానికి కూడాఅనేక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి తమిళనాడులోని కళ్లకురుచి జిల్లాకు చెందిన విజయ్(30) అతని వదిన మంజు (26) కలసి వెళ్ళాడు. మంజు భర్త ప్రభు ఉపాధి నిమిత్తం 2017 లో విదేశానికి వెళ్ళాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు. మంజు భర్త ప్రభు, విజయ అన్నదమ్ములు. వీధి ఉమ్మడి కుటుంబం కావడంతో అందరూ ఒకే చోట ఉండే వారు. ఇక తన అన్న ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లడంతో తమ్ముడు విజయ్ వదిన వదిన మంజు తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ పసిపిల్లల కళ్లుగప్పి రాసలీలలు సాగించేవారు. ఈ క్రమంలోనే వీళ్ళు ఏర్కాడ్ కి వచ్చి అక్కడ కొద్ది రోజులు గడిపి వెళుతూ ఉండేవారు.

ఈ క్రమంలోనే తాజాగా వీరు అక్కడికి వచ్చి భార్య భర్తలు అని చెప్పి అక్కడ గది అద్దెకు తీసుకున్నారు. ఇద్దరు మద్యం సేవించారు. ఆ తర్వాత విజయ్ కు పెళ్లి ఫిక్స్ అయిందని జనవరి 23న పెళ్లి చేసుకోబోతున్నానని ఇకపై మనం కలవడం కుదరదు అని తన వదినకు స్పష్టం చేశాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. మద్యం మత్తులో ఇద్దరూ కాసేపు వాదించుకుని ఆ తర్వాత పడుకో నిద్ర పోయారు. ఇక తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విజయ్ కు మెలుకువ వచ్చి చూడగా పక్కన తన వదిన మంజు లేదు. బాత్రూంకు వెళ్లి ఉంటుందని భావించి, ఎంత సేపటికి ఆమె బయటకు రావడంతో అనుమానం వచ్చి డోర్ కొట్టాడు. అయిన స్పందించకపోవడంతో డోర్ బద్దలుకొట్టి చూడగా మంజు ఉరివేసుకుని నగ్నంగా ఉన్న స్థితిలో కనిపించింది. అప్పటికే ఆమె చనిపోయింది. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.