తాజ్‌మహల్‌ కి బాంబు బెదిరింపు…ఆగ్రాలో హైఅలర్ట్

ప్రపంచంలోనే అందమైన కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పర్యాటకులను ఖాళా చేసి తాజామహల్‌ను మూసివేశారు. తాజామహల్‌లో బాంబు పెట్టినట్లు గురువారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో బాంబు స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు బెదింపు రావడంతో స్థానికంగా కలకలం రేగుతోంది.

Taj Mahal: తాజ్‌మహల్‌ను పేల్చేస్తాం.. బాంబు పెట్టామని బెదిరింపు.. ఆగ్రాలో హైఅలర్ట్

గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి కాల్ చేశాడు. తాజ్‌మహల్ లోపల బాంబులు పెట్టామని..కాసేపట్లో పేల్చేస్తామని చెప్పారు. ఆ ఫోన్ రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే పర్యాటకులను బయటకు తరలించి.. తాజ్‌మహల్ మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు, సీఐఎస్ఎఫ్‌తో పాటు బాంబు స్క్వాడ్ సిబ్బంది తాజ్ మహల్ లోపల తనిఖీలు చేపట్టారు. ప్రతి చోటును చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే తాజ్‌మహల్ లోపల ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఐనప్పటికీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐతే పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ గురించి కూడా అధికారులు ఆరాతీస్తున్నారు. యూపీలోని ఫిరోజాబాద్ నుంచి కాల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజ్ మహల్.. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక స్థలం. భారతీయులతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అలాంటి తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు రావడంతో ఆగ్రాలో తీవ్ర కలకలం రేగింది.