మందులోకి మంచింగ్ కోసం దారుణానికి పాల్పడిన మందుబాబులు.. షాక్ ఇచ్చిన పోలీసులు?

ప్రస్తుత కాలంలో మనుషులు చాలా క్రూరంగా మారిపోతున్నారు. బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు క్రూరం మృగాలపట్ల మరి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది మనుషులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే మనుషుల కంటే అడవుల్లో జీవించే మృగాలే నయం అనిపించేలా ప్రస్తుతం పరిస్థితి ఉంది. ఎందుకంటే సాటి మనుషులకు చిన్న అపాయం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలి పడాల్సిన మనిషి ఇక ఇప్పుడు దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సాటి మనుషుల విషయంలోనే కాదు మూగజీవాల విషయంలో కూడా జాలి చూపించడం లేదు.

ముఖ్యంగా కొందరు వ్యక్తులు మద్యం మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు మందుబాబులు చేసిన పని ప్రస్తుతం సంచలనంగా మారింది. సాధారణంగా మద్యం తాగేవారు మంచి కోసం చికెన్, మటన్ చిప్స్ వంటి వాటిని తింటూ ఉంటారు. అయితే మందుకు బానిసైనా ఇద్దరు వ్యక్తులు మందులు మంచి కోసం రెండు కుక్కలను పొట్టన పెట్టుకున్నారు. మందులో మంచు కోసం కుక్కల చెవులు తోక కోసి మరి దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని బర్రెల్లి జిల్లా ఫరీద్ పూర్ ప్రాంతంలోని ఎస్ డి ఎం కాలనీకి చెందిన ముఖేష్ వాల్మీకి అనే వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి ఫుల్లుగా మద్యం సేవించారు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వీరిద్దరూ అక్కడే ఉన్న రెండు కుక్కలను పట్టుకుని ఆ కుక్కలకు చెవులు కోసేటమే కాకుండా తోక కూడా కోసి వాటికి ఉప్పు కారం దట్టించి వాటిని మందులోకి మంచింగ్ గా వాడుకున్నారు. అయితే ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న ధీరజ్ అనే వ్యక్తి ఈ తతంగం మొత్తం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఇద్దరు మందుబాబులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూగజీవాలను హింసించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.