బిగ్ బాస్ తెలుగు 5: చాలా మార్పులే చేశారే.!

బిగ్ బాస్ తెలుగు 5 విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయ్. కింగ్ అక్కినేని నాగార్జున వరుసగా మూడోసారి ఈ రియాల్టీ షోని హోస్ట్ చేస్తోన్న విషయం విదితమే. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఒకే రోజు బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అనే చర్చ జరగడంలేదెక్కడా. డబుల్ ఎలిమినేషన్లు వుండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక, టీవీ యాంకర్ల విషయానికొస్తే.. గతంలో కనీసం ఇద్దరు యాంకర్లు.. అందునా న్యూస్ ఛానళ్ళ నుంచి వుండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో తెలంగాణ స్లాంగ్ అనేది ఓ మ్యాండేటరీ అన్నట్లుండేది పరిస్థితి. ఇప్పుడు అది పెద్దగా కనిపించడంలేదు. ఈసారి అంతా యంగ్ బ్లడ్ కనిపిస్తోంది. పెళ్ళయినోళ్ళు చాలా తక్కువమందే వున్నారు. చెప్పుకుంటూ పోతే, చాలా మార్పులున్నాయి. గ్లామర్ డోస్ చాలా ఎక్కువే. అంతా స్టైలిష్ అప్రోచ్ కనిపిస్తోందన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. హైపర్ యాక్టివ్ కొందరు.. కూల్ అండ్ కంపోజ్డ్ ఇంకొందరు.. అన్నట్లు కనిపిస్తున్నా, ఎవరికి వారే ‘ఇచ్చి పడేసే’ రకమే.

ఓపెనింగ్ సెర్మానీ అయితే అదిరిపోయింది. కంటెస్టెంట్లను పరిచయం చేసే క్రమంలో కొందరికి స్పెషల్ ‘ఏవీ’లు వేశారు. కొందరు డాన్సులు వేయలేదు. ఓవరాల్‌గా ఓపెనింగ్ అదిరిపోయింది. బిగ్ బాస్ వన్ నుంచి బిగ్ బాస్ ఫైవ్ వరకు తీసుకుంటే, ఛానల్ మార్చాల్సిన అవసరం లేకుండా బిగినింగ్ షో చాలామంది చూసింది బిగ్ బాస్ 5 మాత్రమేనన్న అభిప్రాయాలు బిగ్ బాస్ వ్యూయర్స్‌లో వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆర్మీల విషయానికొస్తే.. ముందస్తుగానే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆర్జే కాజల్, యూ ట్యూబర్ షన్ముఖ్ జస్వంత్ తదితరులుక సపోర్ట్ బాగా లభిస్తోంది. నటి ప్రియకి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది కాస్త చిత్రమైన అంశమే. గతంలో తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్‌ని బిగ్‌హౌస్‌లో చూశాం. అయితే, ఈసారి ప్రియాంక సింగ్ గ్లామర్‌తో అదరగొట్టేలా వుంది. ‘సాయి’ పేరుతో జబర్దస్త్‌లో లేడీ గెటప్పేసిన కమెడియన్, ప్రియాంక సింగ్‌గా మారిన సంగతి తెల్సిందే. లోబో, రవి.. ఇలా చాలా తెలిసిన మొహాలే బిగ్‌హౌస్‌లో వుండడం బిగ్ బాస్ వీక్షకుల్లో జోష్ పెంచుతోంది.