Depthi : న్యూ షాక్: దీప్తి సునయన, షన్ముఖ్ జస్వంత్ ఎందుకు విడిపోయారంటే.!

Depthi :వాళ్ళిద్దరూ ప్రేమికులట. ఆ విషయం ‘బిగ్ బాస్’ రియాల్టీ షో పుణ్యమా అని హైలైట్ అయ్యింది. ఇద్దరూ యూ ట్యూబ్ ద్వారా పాపులర్ అయినవారే. వారి ప్రేమ గురించీ, స్నేహం గురించీ అంతకు ముందు పెద్దగా చర్చ లేదు. బిగ్ బాస్ దెబ్బకి ఆ ఇద్దరూ పాపులర్ అయ్యారు.

ఆ ఇద్దరూ ఎవరో కాదు దీప్తి సునయన, షన్ముఖ్ జస్వంత్. ఇద్దరిలో ముందుగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యింది దీప్తి సునయన. నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ కంటెస్టెంట్ దీప్తి సునయన. ఆ సీజన్‌లో దీప్తి పెద్దగా ఆకట్టుకున్నది లేదు.

ఇక, షన్ముఖ్ విషయానికొస్తే, బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ రన్నరప్. టైటిల్ కొట్టేస్తాడని అంతా అనుకున్నారుగానీ, చివరి నిమిషంలో ఈక్వేషన్ మారిపోయింది. అసలు టాప్ ఫైవ్ వరకూ షన్నూ రావడమే గొప్ప.. అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

ఇంతకీ, దీప్తి – షన్నూ ఎందుకు విడిపోయారు.? తాము విడిపోతున్నట్టు దీప్తి సోషల్ మీడియాలో ప్రకటించడానికన్నా ముందే, దీపు తనను బ్లాక్ చేసిందంటూ షన్నూ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది.?
షన్నూ – దీప్తి మధ్య అభిప్రాయ బేధాలు గతంలోనూ వచ్చాయట. కానీ, అప్పుడు అవి తేలిగ్గానే సమసిపోయాయి. కానీ, ఈసారి ఎక్కువయ్యాయని అంటున్నారు. షన్నూ తన పేరుని కేవలం ‘పాపులారిటీ పెంచుకోవడానికి’ వాడుకున్నాడనే భావన దీప్తిలో పెరిగిపోవడమే ఈ బ్రేకప్‌కి కారణమని అంటున్నారు.

బిగ్ బాస్ సీజన్ ముగిసిన వెంటనే షన్నూ, దీప్తిని కలవలేదట. అలా కలవకపోవడం కూడా దీప్తికి కోపం తెప్పించిందని అంటున్నారు. సిరితో బిగ్ హౌస్‌లో మరీ చనువుగా షన్నూ మెలగడం కూడా ఈ బ్రేకప్‌కి కారణమట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, సిరికి ఇది పెద్ద సమస్య కాలేదు. సిరిని ఆమె లవర్ అర్థం చేసుకున్నాడు. షన్నూ పరిస్థితే దారుణంగా తయారైందిప్పడు. అరే ఏంట్రా షన్నూ ఇది.?