జోధ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రాజస్థాన్​ జోధ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో- ట్రక్కు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ముగ్గురు తీవ్ర గాయలయ్యాయి. దైవదర్శనానికి వెళ్తుండగా జోధ్​పుర్​- జైపుర్​ జాతీయ రహదారి బిలాడా వద్ద అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఘటనలో గాయపడ్డ ముగ్గురి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.