Batasari Nagababu : నాగబాబు ‘బాటసారి’గా మారిన వేళ.! ఏం జరుగుతోందబ్బా.?

Batasari Nagababu : మెగా బ్రదర్ నాగబాబు బాటసారిగా మారారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇకపై ప్రజలకు మరింత దగ్గరగా వుంటాననే సంకేతాలు పంపారు. దేశానికి సేవ చేయాలన్న తన ఆలోచన దిశగా మరింత ముందడుగు వేస్తున్నానంటున్నారు. కష్టాలే తనను ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టాయని అన్నారు.

అసలేం జరుగుతోంది.? నాగబాబు ఎందుకు బాటసారిగా మారారు.? నాగబాబు కొత్తగా నిర్దేశించుకున్న లక్ష్యమేంటి.? ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని పూర్తిగా వదిలేసి ప్రజా సేవ కోసం సిద్ధమవుతారా.? ఈ క్రమంలో తమ్ముడి పార్టీ జనసేనలో యాక్టివ్ అవుతారా.? లేదంటే, కొత్త ఆలోచనలేమైనా చేస్తున్నారా.?

సవాలక్ష ప్రశ్నలు జనం మదిలోనూ, జనసైనికుల మదిలోనూ మెదులుతున్నాయి. మొన్నామధ్య జనసేన పార్టీ మత్స్యకార సభ అంటూ హంగామా చేస్తే, ఆ వేదికపై నాగబాబు కనిపించారు. రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలోనూ కనిపించబోతున్నారు.

నిజానికి, జనసేన పార్టీకి నాగబాబు కొత్త కాదు. తమ్ముడి పార్టీలో చేరి, 2019 ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా పని చేయలేదు. కానీ, ఏమయ్యిందో మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు.

అభిమానులందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడంలో నాగబాబుకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. మెగా కాంపౌండ్‌లో హీరోలందరి అభిమానులకూ నాగబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయంటారు. కానీ, గత ఎన్నికల్లో జనసేన పార్టీకి నాగబాబు మంత్రం పని చేయలేదు. అయితే అప్పటి పరిస్థితులు వేరు.

ఇప్పుడు నాగబాబు ఏం చేయబోతున్నారు.? వేచి చూడాల్సిందే.