Bandla Ganesh: బండ్ల గణేష్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగారు అనంతరం నిర్మాతగా మారి మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈయన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ వచ్చారు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో బండ్ల గణేష్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇలా రాజకీయాలలోకి వచ్చిన ఈయన రాజకీయాల పరంగా ఎలాంటి పదవులను ఆశించలేదు అలాగే రాజకీయాలలో కూడా పెద్దగా చురుగ్గా లేరు.
ఇలా రాజకీయాలకు దూరంగా ఉంటూనే సినిమాలకు దూరంగా ఉంటూనే ఈయన తరచూ సినిమా ఇండస్ట్రీపై రాజకీయాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఈయన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారన్నది మాత్రం వెల్లడించలేదు కానీ ఈ పోస్ట్ మాత్రం ప్రస్తుతం చర్చలకు కారణం అవుతుంది.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలనీ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక బండ్ల గణేష్ ఈ పోస్ట్ కచ్చితంగా నాగబాబును ఉద్దేశించి చేశారని పలువురు భావిస్తున్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు తామే కారణమని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అంటూ మాట్లాడారు. నిజానికి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ ఎంతో కృషి చేశారు. ఆ విషయాన్ని మరిచి నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే బండ్ల గణేష్ సైతం ఈ పోస్ట్ నాగబాబును ఉద్దేశించి చేశారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.