కుటుంబ రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టడమే తమ లక్ష్యం: సోము వీర్రాజు

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తాజాగా విజయవాడలో జరగనున్న ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా నిర్వహించే సభ ఏర్పాట్లను పరిశీలించగా అక్కడ మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు అడుగులు వేస్తున్నాయి అని అన్నారు. అంతేకాకుండా మెట్టు ఎవరు ఎక్కుతారో, ఎవరు దిగుతారో కూడా త్వరలో తెలుస్తుంది అని అన్నారు.

ఇక పవన్ ఇచ్చిన మూడు ఆప్షన్లలో ఒక ఆప్షన్ గురించి తామే పరిగణలోకి తీసుకుంటామని.. రెండో ఆప్షన్ గురించి తెలుగుదేశం పార్టీని అడగాలని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని దీనికి సమాధానం ఆత్మకూరు ఉప ఎన్నిక ద్వారా తెలుపుతామని అన్నారు. ఇక కుటుంబ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టడమే తమ లక్ష్యమని అన్నారు.