ఫుల్ జోష్ లో ఉండే ఏపీ తారా జువ్వ లేడీ మినిస్ట‌ర్- ఒక్క దెబ్బ‌కి పిన్ డ్రాప్ సైలెన్స్!

కురుపాం నియోజ‌క వ‌ర్గం నుంచి గెలిచిన పుష్ప శ్రీవాణి అటుపై పార్టీలో ఎలా పైకొచ్చారో చూస్తున్నే ఉన్నాం. జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలోనే ఆమెను ఏకంగా డిప్యూటీ సీఎంనే చేసి ఊహించ‌ని షాకిచ్చారు. దీంతో ఆమె  ఒక్క‌సారిగా తెలుగు రాష్ర్టాల్లో  వెలిగిపోయా రు. ఇక ఆ త‌ర్వాత ఆ లేడీ మినిస్ట‌ర్ జ‌గ‌న్ పై, వైఎస్సార్ ఫ్యామిలీపై అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా సాన్నిహిత్యాన్ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేసారు.  పుష్ప శ్రీవాణి చేతిపై వైఎస్సార్ ప‌చ్చబొట్టు..ఆపై  జ‌గ‌న్ పై టిక్ టాక్ వీడియోలు చేసి సోష‌ల్ మీడియా దూసుకుపోయారు. ఆ ర‌కంగా ఫేమ‌స్ మినిస్ట‌ర్ గా సోష‌ల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. ప్ర‌భుత్వంపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల్ని అంతే ధీటుగా తిప్పికొట్టేవారు.

అయితే ఇప్పుడీ తారాజువ్వ ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు. గ‌త మూడు నెల‌లుగా పుష్ప శ్రీవాణి బాణీ ఎక్క‌డా వినిపించ లేదు. ఎందుకిలా మౌనం దాల్చుతున్నారంటే? ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తున్నాయి. పుష్ప శ్రీవాణి మామ‌గారు కార‌ణంగా కోడ‌లు సైలెంట్ అయింద‌న్న‌ది ఇన్ సైడ్ టాక్. జ‌గ‌న్ పాల‌న‌పై మామ ఎప్ప‌టిక‌ప్పుడు తూర్పురా ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచే పాల‌న అందిస్తున్నాడ‌ని ఇది రాజ్యాంగ విరుద్దం అంటూ ఆయ‌న మండిప‌డ్డారు. జిల్లాల విభ‌జన అంశాన్ని కూడా ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. అయితే వీటిపై ఏనాడు పుష్ప శ్రీవాణి స్పందిచ‌లేదు.

వాటిని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిప్పికొట్టినా పుష్ప శ్రీవాణి మామ‌కు మ‌ద్ద‌తుగాగానీ, జ‌గన్ కి స‌పోర్ట్ గా గానీ రాకుండా సైలెంట్ గానే ఉన్నారు. మ‌రి ఇలా ఎన్నాళ్లు మౌనం దాల్చుతారు? అన్న‌ది వేచి చూడాలి. అయితే ఆమెను రాజ‌కీయంగా కూడా ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ట్లు స‌మాచారం. సొంత జిల్లాలో ఆమెను తొక్కే ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్నాయ‌ని వార్త‌లొస్తున్నాయి. మ‌రి అవి నిజ‌మే అయితే వాటిని పుష్ప శ్రీ వాణి ఎలా అధిగ‌మించి ముందుకెళ్తారు? అన్న‌ది చూడాలి.