త్వరలో పులివెందుల పర్యటనకు సిద్ధకానున్న సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొన్ని రోజుల నుండి పర్యటన భాగంలో బాగా బిజీగా ఉన్నారు. ఇక త్వరలో పులివెందుల పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలను కడప ఎస్పీ అన్బురాజన్ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆర్ అండ్ బి అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన నేతలతో, నాయకులతో సమావేశం చేయనున్నట్లు తెలిసింది.

ఇక ఆ గెస్ట్ హౌస్ లో చేయాల్సిన ఏర్పాట్లు గురించి పోలీస్ అధికారులకు ఎస్పీ పలు సూచనలు కూడా అందించారట. అంతేకాకుండా హెలిప్యాడ్ నుంచి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు రానున్న రోడ్డు మార్గంలో బందోబస్తు ఏర్పాటు కూడా చేయాలని సూచించారట. ఇక ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసులు, పలువురు సిఐలతో పాటు ఇతర సిబ్బంది లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమావేశంలో వైఎస్ జగన్ దేని గురించి చర్చిస్తారు తెలియాల్సి ఉంది.