ఏపీలో ఏప్రిల్ 4 నుండి పాఠశాలలు ఒక్కపూట బడులు

ఈనెల 4 నుంచి ఏపీ పాఠశాలలు ఒక్కపూట బడులు ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం 7:30 నుంచి 11:30 గంటల వరకు తరగతులు జరుగనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 27 నుంచి పదో తరగతి మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు.