తెలంగాణలోని హైదరాబాద్ లో ‘అమృత్ ఆహార్’

హైదరాబాద్, డిసెంబర్ 21, 2022: పండుగల సీజన్‌కు ముందుగా, భారతదేశంలోని అతిపెద్ద డయాలసిస్ కేంద్రాల నెట్‌వర్క అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలో పాఠశాలలకు వెళ్లే నిరుపేదల పిల్లలకు ఏదైనా అందించ డానికి సీక్రెట్ శాంటాగా మారింది. 2023 ఏప్రిల్ వరకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని మదీనా గూడలోని అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో చదువుతున్న 350+ పిల్లలకు వారానికోసారి అల్పాహార సేవను అందించడానికి హైదరాబాద్‌కు చెందిన జగతి ఫౌండేషన్ భాగస్వామ్యంతో సంస్థ “అమృతఆహర్” అనే దా తృత్వ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో 13 సంవత్సరాల విజయవంతమైన ప్రయా ణాన్ని నిర్వహించుకోవడానికి బ్రాండ్ సామాజిక కార్యకలాపాలలో ఈ కార్యాచరణ ఒక భాగం.

ఈ కార్యక్రమం ద్వారా నెఫ్రోప్లస్ నిధులు అంతగా లేని పాఠశాలలకు సహాయం చేయాలనుకుంటోంది. ఈ పాఠశాలలోని పిల్లలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబ కుటుంబాలకు చెందినవారు. వీరు తరచుగా రోజువారీ భోజనం ద్వారా సరైన పోషకాహారాన్ని అందుకోవడాన్ని కోల్పోతుంటారు. ఇలాంటి పిల్లలకు పో షకయుక్త అల్పాహారాన్ని నెఫ్రోప్లస్ అందిస్తుంది. ఇది వారి పోషకాహార స్థాయిలను, వారు తరగతులకు హాజరు కావడాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ సందర్భంగా నెఫ్రోప్లస్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ విక్రమ్ ఉప్పాల మాట్లాడుతూ, ”పాఠశాలకు వెళ్లాలంటే ఆ తపన ఉండాలి, బాగా చదవాలి అంటే మంచి ఆహారం కూడా అందాలి. క్రమం తప్పకుండా తినడానికి తగినంత పోషకమైన ఆహారాన్ని పొందని పిల్లలు గణనీయంగా ఎక్కువ ప్రవర్తనా, భావోద్వేగ, విద్యా పరమైన సమస్యలను కలిగి ఉంటారు. అందువల్ల, పాఠశాలలో పిల్లలకు ఆరోగ్యకరమైన అల్పాహారం అం దించే చర్య వారి విద్యా పనితీరు, ఆరోగ్యం, ఆర్థిక భవిష్యత్తుపై గణనీయ ప్రభావాన్ని చూపుతుంది. పాఠ శాలతో ఈ సహకారాన్ని నెలకొల్పినందుకు, ఎంతో అవసరమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చినందుకు జగతి ఫౌండేషన్‌కు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదృష్టవశాత్తూ, ఈ రోజు ఆరోగ్య సంరక్షణ పరి శ్రమలో మా విజయవంతమైన ప్రయాణం యొక్క 13వ సంవత్సరాన్ని సూచిస్తుంది. పిల్లల నిర్మాణాత్మక

సంవత్సరాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి సరైన పోషకాహారాన్ని ప్రోత్సహించడానికి చేప ట్టిన ఈ సామాజిక కార్యక్రమంతో వచ్చే ఏడాదిని ప్రారంభించేందుకు మేం సంతోషిస్తున్నాం’’ అని అన్నారు.

జగతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ప్రెసిడెంట్ దుర్గాకళ్యాణి మాట్లాడుతూ, ‘‘నెఫ్రోప్లస్ వంటి ప్రఖ్యాత ఆరోగ్య సంరక్షణ సంస్థతో ఒక గొప్ప ప్రయోజనం కోసం చేతులు కలపడం మాకు ఆనందదాయకం. అబూ బకర్ (వైస్ ప్రెసిడెంట్), రామ చంద్ర (జాయింట్ సెక్రటరీ),మొత్తం బృందం మద్దతుతో, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ బ్రాండ్ ద్వారా సహకారం అందించబడింది. భారతదేశం దశాబ్దాలుగా పోషకాహార లోపంతో పోరాడుతోంది, ఇటువంటి సామాజిక కార్యక్రమాల ద్వారా మాత్రమే మనం దానిని తగ్గించగలం. భారతీయ పిల్లలకు ఆహార భద్రత బలమైన ఆచరణను సృష్టించగలం. జగతి ఫౌండేషన్ తన ‘అమృత ఆహర్’ కార్యక్రమాన్ని తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాలని యోచిస్తోంది’’ అని అన్నారు.

నెఫ్రోప్లస్ గురించి:

నెఫ్రోప్లస్ భారతదేశంలోని 25 రాష్ట్రాల్లోని 180కి పైగా నగరాల్లో 300 డయాలిసిస్ కేంద్రాలు నిర్వహిస్తోంది. అవి నాణ్యతపై దృష్టికి, రోగి కేంద్రితంగా ఉండడంలో పేరొందాయి. ప్రపంచవ్యాప్తంగా డయాలిసిస్ పై ఉన్న వారిని దీర్ఘకాలిక, సంతోషదాయక, నిర్మాణాత్మక జీవితాలను గడిపేలా చేసే ఆశయంతో సంస్థ 13 ఏళ్ళ క్రితం నెలకొల్పబడింది. సంస్థ నెలకు 18,000 మందికి పైగా రోగులకు సేవలను అందిస్తోంది, 60 లక్షలకు పైగా చికిత్సలను అందిస్తోంది.